రూ.5 కోట్ల కారు ఎమ్మెల్సీ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తనయుడిది
కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తనయుడి పేరున రూ. 5 కోట్ల విలువైన కారు రిజిస్ట్రేషన్ అయింది.
హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తనయుడి పేరున రూ. 5 కోట్ల విలువైన కారు రిజిస్ట్రేషన్ అయింది. కోమటిరెడ్డి తనయుడు కార్తీకర్ రెడ్డి పేరున ఈ కారును శుక్రవారం నాడు రిజిస్ట్రేషన్ చేశారు.
సుమారు ఐదుకోట్ల విలువ చేసే ఫెరారే కారు ఖైరతాబాద్ ఆర్ టీ ఏ కార్యాలయంలోకి వెళ్ళలేదు.ఈ కారును రిజిస్ట్రేషన్ కోసం ఖైరతాబాద్ కార్యాలయానికి తీసుకు వచ్చారు.అయితే ఈ కార్యాలయంలోకి కారు వెళ్ళలేదు.
దీంతో ఏం వీ ఐ చంద్రశేఖర్ కార్యాలయం నుండి బయటకు వచ్చి కారు రిజిస్ట్రేషన్ చేశారు. అయితే ఈ కారుకు ప్యాన్సీ నెంబర్ కోసం వేలం పాటలో పాల్గొన్నారు.
వేలం పాటలో సుమారు. రూ.1.98 లక్షలను వెచ్చించి ప్యాన్సీ నెంబర్ ను దక్కించుకొన్నారు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కుటుంబసభ్యులు.ఈ కారును కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కొడుకు కార్తీక్ రెడ్డి పేరున రిజిస్ట్రేషన్ చేయించారు.