వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

విచిత్రం: తెలంగాణలో జనాభా సంఖ్యను దాటిన మొబైల్ కనెక్షన్లు

By Nageshwara Rao
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: జనాభా కన్నా మొబైల్ ఫోన్ కనెక్షన్ల సంఖ్య పెరిగిన విచిత్ర పరిస్థతి తెలంగాణలో నెలకొంది. రాష్ట్రంలో 3.52 కోట్ల జనాభా ఉండగా చరవాణి కనెక్షన్లు 3.66 కోట్లుగా ఉంది. సమాచార కమ్యూనికేషన్ల వ్యవస్థను విశ్లేషిస్తూ, రాష్ట్ర అర్థ గణాంక శాఖ తాజాగా విడుదల చేసిన రిపోర్టులో ఈ విషయం వెల్లడైంది.

రాష్ట్రంలో 2011 జనాభా లెక్కల ప్రకారం 83,03,612 కుటుంబాలు నివసిస్తుండగా 3.66 కోట్ల మొబైల్ కనెక్షన్లు ఉన్నాయి. సగటున ప్రతి కుటుంబంలో నలుగురు మొబైల్ ఫోన్లను ఉపయోగిస్తున్నట్టు వెల్లడైంది. మొత్తం సెల్ ఫోన్ కనెక్షన్లలో మూడింట ఒక వంతు హైదరాబాద్, రంగారెడ్డి పరిధిలోనే ఉన్నాయి.

Mobile connections reached more than people in telangana

రాష్ట్రంలో 6,24,224 ల్యాండ్‌ఫోన్‌లు ఉండగా వీటికోసం 1314 టెలిఫోన్‌ ఎక్స్‌ఛేంజ్‌లు పనిచేస్తున్నాయి. 13223 ప్రజా టెలిఫోన్‌లు ఉండగా వీటిలో సగం కంటే ఎక్కువ హైదరాబాద్‌, రంగారెడ్డి జిల్లాలోనే ఉన్నాయి. హైదరాబాద్ పబ్లిక్ టెలిఫోన్ బూత్ ల సంఖ్య 8,220కి తగ్గింది.

English summary
Mobile connections reached more than people in telangana.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X