వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తెలంగాణ ఎన్నికలకు బీజేపీ అగ్రనేతలు.. మోడీ, అమిత్ షా టూర్ ఖరారు..!

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్ : తెలంగాణ ఎన్నికల్లో ప్రచార పర్వం వేడెక్కుతోంది. ఇప్పటికే ఆయా పార్టీలు రోడ్ షోలు, బహిరంగ సభలతో జనాల్లోకి వెళుతున్నాయి. ఈ క్రమంలో తెలంగాణ ఎన్నికల్లో ప్రచారం చేయడానికి బీజేపీ అగ్రనేతల షెడ్యూల్ దాదాపుగా ఖరారైంది. ప్రధాని నరేంద్ర మోడీ, బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా పర్యటనకు సంబంధించి ప్రచార షెడ్యూల్ రెడీ అయినట్లు సమాచారం. మోడీ 6 సభల్లో.. అమిత్ షా 12 సభల్లో పాల్గొంటారని తెలుస్తోంది.

వచ్చే నెల 3, 5 తేదీల్లో మోడీ రాష్ట్రానికి రానున్నారు. ఆయన 6 సభల్లో పాల్గొనేలా ప్లాన్ చేశారు రాష్ట్ర నేతలు. రోజుకు 3 చొప్పున ఈ రెండు రోజుల పాటు 6 సభల్లో మోడీ ప్రసంగిస్తారని సమాచారం. అదలావుంటే ఈనెల 25, 27, 28 తేదీల్లో అమిత్ షా పర్యటించనున్నారు. వీలునుబట్టి రోజుకి 3 నుంచి 4 చొప్పున 12 సభల్లో ఆయన పాల్గొంటారని తెలుస్తోంది. ఈమేరకు రాష్ట్ర నాయకత్వం ప్లాన్ చేస్తోంది. బీజేపీ స్ట్రాంగ్ గా ఉన్న నియోజకవర్గాల్లో మోడీ, అమిత్ షా సభలను ఏర్పాటు చేస్తున్నట్లు వినికిడి. అయితే ఈ ఇద్దరి టూర్ మీద బీజేపీ అధికారిక ప్రకటన త్వరలో వెలువడనుంది.

modi and amit shah telangana tour

English summary
pm modi and bjp national president amit shah telangana tour scheduled for election campaign.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X