వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

'ఇక్కడ కేసీఆర్, ఢిల్లీలో మోడీ:ఆ లక్షణాలు కలిపాయి'

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: ప్రధాని నరేంద్ర మోడీ, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావుల పైన మాజీ కేంద్రమంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జైరామ్ రమేష్ ఆదివారం మండిపడ్డారు. ప్రధాని మోడీ, కేసీఆర్‌ల మధ్య అనేక సారూప్యతలు ఉన్నాయన్నారు.

ఇద్దరు కూడా తమ తమ మాటలతోనే కోటలు కడుతున్నారని విమర్శించారు. నిరంకుశ అధికారాన్ని చెలాయించడంలో ఇద్దరూ ఒకరికి ఒకరు సరిపోతారన్నారు. ఢిల్లీలో మోడీ, హైదరాబాదులో కేసీఆర్ గొప్పలు చెబుతున్నారని, మాటలతోనే కోటలు కట్టడం అనే లక్షణం వారిని కలుపుతోందన్నారు.

Modi's is most centralised government in India's history: Jairam Ramesh

నిరంకుశత్వం కూడా ఇద్దరినీ ఏకం చేస్తోందన్నారు. ఇద్దరిదీ నిరంకుశమే అన్నారు. తెలంగాణలో భిన్నాభిప్రాయాలు వెలిబుచ్చితే అణిచివేస్తు్నారని, అలాగే మోడీ కూడా చేస్తున్నారన్నారు. గొప్పలు చెప్పుకోవడంలో వారిద్దరు వారికే సాటి అన్నారు. భారత దేశ రాజకీయ చరిత్రలో అత్యంత సెంట్రలైజ్ ప్రభుత్వం మోడీదే అన్నారు.

English summary
Narendra Modi is running "the most centralised" government ever in India's history, marginalising his cabinet, BJP and MPs, former Union minister Jairam Ramesh has charged.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X