వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఎన్‌కౌంటర్: ఒక మవోయిస్టు గుర్తింపు, మృతుల్లో కంకణాల రాజిరెడ్డి?

By Pratap
|
Google Oneindia TeluguNews

Recommended Video

Encounter : Ten Maoists And A Constable Lost Life

భద్రాచలం: ఎన్‌కౌంటర్‌లో మరణించిన మావోయిస్టుల మృతదేహాలను గుర్తించే పని సాగుతోంది. ఎన్‌కౌంటర్‌లో మరణించిన పది మంది మావోయిస్టుల మృతదేహాలు భద్రాచలం ఏరియా ఆస్పత్రికి చేరుకున్నాయి.

మృతుల్లో ఒకరిని గుర్తించారు. వరంగల్ జిల్లా ఏరియా కమిటీ కార్యదర్శి దడబోయిన స్వామి అలియాస్ ప్రభాకర్‌ను గుర్తించారు. ఆయనది వరంగల్ జిల్లా మడికొండ శివారులోని రాంపేట. మృతుల్లో కంకణాల రాజిరెడ్డి ఉన్నట్లు అనుమానిస్తున్నారు.

Moists dead bodies at Bhadrachalam: one identified

ఎన్‌కౌంటర్ జరిగి 24 గంటల సమయం దాటింది. ఫొటోల ఆధారంగా మావోయిస్తులను గుర్తించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. కొంత మంది మాజీ నక్సలైట్ల సాయం కూడా తీసుకుంటున్నారు.

పోస్టుమార్టం నిర్వహణకు నలుగురు వైద్యులు, నలుగురు ఫోరెన్సిక్ నిపుణులు ఆస్పత్రికి చేరుకున్నారు. హైకోర్టు ఆదేశాల మేరకు పోస్టుమార్టం ప్రక్రియ యావత్తు వీడియో చిత్రీకరణ జరగనుంది.

Moists dead bodies at Bhadrachalam: one identified

మృతుల్లో సుజాతక్క, నరేష్ ఉన్నట్లు తెలుస్తోంది. ఎన్‌కౌంటర్ నుంచి మావోయిస్టు అగ్రనేతలు తప్పించుకున్నట్లు తెలుస్తోంది. శుక్రవారం తెల్లవారు జామును తెలంగాణలో చర్ల సమీపంలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో పది మంది నక్సలైట్లు మరణించిన విషయం తెలిసిందే. వారిలో నలుగురు మహిళా నక్సలైట్లు ఉన్నారు.

English summary
The identification of dead Maoists is continuing at Bhadrachalam area hospital in Telangana.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X