చల్లని వార్త... జూన్ 4న వర్షాలు, కేరళను తాకనున్న నైరుతి రుతుపవనాలు
ఎండలతో సతమతమవుతున్న ప్రజలకు శుభవార్తను..అందించించాయి వాతవరణ అంచనా ఏజన్సీలు..మరో పదిహేను రోజుల్లో వాతవరణం చల్లబడే అవకాశాలు కనిపిస్తున్నాయి..ఈనేపథ్యంలోనే జూన్ మొదటి వారంలో నైరుతి రుతుపవనాలు కేరళ తీరాన్ని తాకనున్నట్టు, వాతవారణాన్ని అంచనవేసే ఏకైక ప్రవైట్ సంస్థ అయిన స్కైమేట్ ఎజన్సీ తెలిపింది.
ఎజన్సీ వివరాల ప్రకారం జూన్ 4న నైరుతి రుతు పవనాలు కేరళ తీరాన్నీ తాకనున్నట్టు ప్రకటించింది. కాగా జూన్ మొదటి వారం నుండి జూలై 15 వరకు మొత్తం దేశవ్యాప్తంగా వర్షాలు విస్తరిస్తాయని తెలిపింది. అయితే గత సంవత్సరం కంటే సాధరణ వర్షపాతం నమోదు అవుతుందని అంచనా వేసింది. కాగా ఈ వర్షాలు, వరి ,పత్తి, సోయాబీన్ పంటలకు అనుగుణంగా కురుస్తాయని తెలిపారు. ఇక దేశవ్యాప్తంగా సరాసరిగా 93శాతం వర్షపాతం నమోదయ్యో అవకాశాలు ఉన్నట్లు ఒక ప్రకటనలో తెలిపింది.
కాగా దేశవ్యాప్తంగా కురిసే వర్షాలపై భారత ఆర్ధిక వ్యవస్థ ఆధారపడి ఉండే విషయం తెలిసిందే, ఆసీయా దేశాల్లోనే భారత్ అతిపెద్ద వ్వవసాయిక దేశమైన.. ఇంకా వర్షాలను ఆధారంగా చేసుకుని పంటలు వేసుకోవాల్సిన పరిస్థితి..అయితే ఇప్పుడిప్పుడే రైతు సంక్షేమంపై దృష్టిపెట్టే రాష్ట్ర్ర కేంద్ర ప్రభుత్వాలు వారికి ఇతర మార్గాల ద్వార నీటీని అందించే ఏర్పాట్లు చేస్తున్నారు..వచ్చిన వర్షాన్ని ఒడిసిపట్టి రైతన్నలకు అందించే ఏర్పాట్లు చేస్తున్నారు.