వ్యాధి నయం గాక తల్లీ, అమ్మ లేని జీవితం ఎందుకని కొడుకు : ఇద్దరి మృతి
శ్రీశైలం : క్యాన్సర్ రక్కసి ఇద్దరి ప్రాణాలను బలితీసుకుంది. వ్యాధి నయం కాదని తల్లి ఊపిరి వదలగా ... తల్లి లేని జీవితం తనకేందుకు అనుకున్న కుమారుడు కూడా తనువు చాలించాడు. ఈ విషాద ఘటన శ్రీశైలం సమీప అడవుల్లో చోటుచేసుకుంది.
ఏడేళ్ల బాలుడిపై అత్యాచారం... హత్య !
క్యాన్సర్ రక్కసి చిచ్చు ..
సూర్యాపేటకు చెందిన చిత్రం మాధవి (34) క్యాన్సర్ వ్యాధితో బాధపడుతుంది. వ్యాధికి సంబంధించి హైదరాబాద్లోనూ చికిత్స తీసుకుంది. తన వ్యాధి నయం కాదని భావించిన ఆమె చనిపోవాలని డిషిసన్ తీసుకుంది. కుమారుడు కార్తీక్ తో కలిసి ఆరురోజుల క్రితం శ్రీశైలం వచ్చింది. వారిద్దరూ సాక్షి గణపతి ఆలయ సమీపంలోని అడవుల్లోకి వెళ్లారు. అప్పటికే తమ వెంట తెచ్చుకున్న పురుగుల మందు, కొన్ని మందులు మింగి ఆత్మహత్య చేసుకున్నారు.
6 రోజుల క్రితమే మృతి
వీరి మృతికి సంబంధించిన సమాచారం బంధువులను సమాచారం అందించారు. తల్లికొడుకులు ఆరురోజుల క్రితం చనిపోయినట్టు వైద్యులు తెలిపారు. వారి మృతదేహాలను అడవి జంతువులు ఈడ్చుకెళ్లడంతో భాగాలు దెబ్బతిన్నాయి.
విఫల ప్రయత్నం ..
కనిపించకుండా పోయిన మాధవి, కార్తీక్ల ఆచూకీ కోసం బంధువులు విశ్వప్రయత్నాలు చేశారు. శ్రీశైలం పరిసరాల్లో గోడప్రతుల ద్వారా ప్రచారం చేశారు. వారం తర్వాత మాధవి, కార్తీక్ విగతజీవులుగా కనిపించడంతో బోరున విలపించారు.