తండ్రి ఉండగానే.. తల్లి మరొకరితో!: రగిలిపోయిన కూతురు ఏం చేసిందంటే?..
హైదరాబాద్: వివాహేతర సంబంధాలు హత్యలకు దారితీస్తున్న సంఘటనలు ఇటీవలి కాలంలో పెరిగిపోయాయి. నాగర్ కర్నూలులో సుధాకర్ రెడ్డి అనే వ్యక్తిని కట్టుకున్న భార్యే కడతేర్చడం సంచలనం స్రుష్టించిన సంగతి తెలిసిందే.
Recommended Video
తాజాగా హైదరాబాద్ లోని బీహెచ్ఈఎల్ పరిధిలో మరో హత్య ఉదంతం వెలుగుచూసింది. తన తల్లితో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడన్న కారణంతో.. అతనిపై కక్ష పెంచుకున్న కూతురు స్నేహితుల సహాయంతో కడతేర్చింది.
అసలేం జరిగింది:
బీహెచ్ఈఎల్ ఎల్ఐజీ కాలనీలోని నివాసముండే రియల్ ఎస్టేట్ వ్యాపారి దుర్గాదాస్(47)పై ఈ నెల 7న దాడి జరిగింది. రాత్రి 9.30 గంటల సమయంలో స్కూటీపై ఇంటికి వెళ్తుండగా ముగ్గురు వ్యక్తులు అతనిపై దాడి చేశారు. దీంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ దుర్గాదాస్ మృతి చెందాడు. నిందితులను స్థానికంగా ఉండే స్టీఫెన్, అంటోని రాబెలో, వరంగల్కు చెందిన శ్రీదీప్సుందర్ లుగా గుర్తించారు.
కారులో వెంబడించి:
తొలుత దుర్గాదాస్ ను ఈ ముగ్గురు కలిసి కారులో వెంబడించారు. బీహెచ్ఈఎల్ టౌన్షిప్లో అతని స్కూటీకి అడ్డం తిరిగారు. ఆ వెంటనే ఇనుపరాడ్తో తలపై తీవ్రంగా గాయపరిచి పరారయ్యారు. కారు నంబర్ ఆధారంగా విచారణ జరిపిన పోలీసులకు అసలు నిజం తెలిసింది.
ఇదీ అసలు నిజం
కారు నంబర్ ఆధారంగా విచారణ జరిపిన పోలీసులు ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి వివరాలు రాబట్టారు.
పోలీసుల కథనం ప్రకారం.. ఎల్ఐజీ కాలనీలోని ఓ మహిళతో దుర్గాదాస్ వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడు. రోజూ మద్యం తాగి ఆమె ఇంటికి వెళ్తుండేవాడు. డిగ్రీ చదువుతున్న ఆమె కూతురు అతను ఇంటికి రావడం సహించలేకపోయింది. తమ పరువు పోతుందని భావించింది. దుర్గాదాస్ ను హతం చేస్తే దీనికి ఫుల్ స్టాప్ పడదని నిర్ణయించుకుంది. అందులో భాగంగానే ప్లాన్ ప్రకారం అతన్ని హత్య చేయించింది.
పరారీలో యువతి:
ప్రస్తుతం ముగ్గురు నిందితులు పోలీసుల అదుపులో ఉండగా.. యువతి మాత్రం పరారీలో ఉంది. దుర్గాదాస్ భార్య ఫిర్యాదు మేరకు నిందితులు ముగ్గుర్నీ అరెస్టు చేసి, రిమాండ్కు తరలించామని పోలీసులు తెలిపారు.
దుర్గాదాస్ను హత్య చేయడానికి స్నేహితులు స్టీఫెన్, అంటోని రాబెలో, శ్రీదీప్ సుందర్ లను సదరు యువతి సహాయం కోరినట్లు పోలీసులు తెలిపారు. యువతి తండ్రి స్థానికంగా ఉన్న ప్రైవేటు కంపెనీలో కార్మికునిగా పనిచేస్తున్నట్లు చెప్పారు.