వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కెసిఆర్‌ను అభినందించిన మోత్కుపల్లి: సిఎం మెప్పుకోసమేనని శశిధర్ రెడ్డి

By Pratap
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: యాదాద్రి అభివృద్ధికి తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు చేస్తున్న కృషికి తెలంగాణ తెలుగుదేశం పార్టీ నాయకుడు మోత్కుపల్లి నర్సింహులు అభినందించారు. యాదగిరిగుట్టను జిల్లా కేంద్రంగా ప్రకటించాలని ఆయన డిమాండ్ చేశారు.

సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. యాదగిరిగుట్టను సిద్దిపేటలో కలపాలనుకోవడం బాధాకరమన్నారు. యాదగిరిగుట్టను సిద్దిపేటలో కలిపితే ఊరుకునే ప్రసక్తే లేదని మోత్కుపల్లి హెచ్చరించారు. యాదగిరిగుట్టును సిద్ధిపేటలో కలపకుండా ప్రత్యేక జిల్లాను ఏర్పాటు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.

Mothkupalli praises KCR on Yadadri development

విచక్షణారహితంగా ఓట్లను తొలగిస్తున్నారని కాంగ్రెసు నాయకుడు మర్రి శశిధర్ రెడ్డి ఆరోపించారు. ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు మెప్పు కోసం హైదరాబాద్ నగర పాలక సంస్థ కమిషనర్ సోమేష్, ఎన్నికల ప్రధానాధికారి భన్వర్ లాల్ ఓట్లను తొలగిస్తున్నారని ఆయన సోమవారం ఆరోపించారు.

నోటీసులు ఇవ్వకుండా ఓట్లను తొలగించడం సరి కాదని ఆయన మీడియాతో అన్నారు. ఎమ్మెల్యేల అనర్హతపై, ఓట్ల తొలగింపుపై సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామని ఆయన చెప్పారు.

English summary
Telugu Desam party leader Mothkupalli Narsimhulu has praised Telangana CM K Chandrasekhar Rao on Yadadri development.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X