వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నేరేళ్ళలో దళితులకు మత్తు మందిచ్చి కొట్టారు: మోత్కుపల్లి

By Narsimha
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: నేరేళ్ళలో దళితులను కులం పేరుతో దూషిస్తూ కొట్టారని, మత్తుమందిచ్చి మరీ కొట్టారని తెలంగాణ టిడిపి నేత మోత్కుపల్లి నర్సింహులు ఆరోపించారు. తన రాజకీయ జీవితంలో ఇలాంటి ఘటనలు చూడలేదన్నారు మోత్కుపల్లి.

నేరేళ్ళ ఘటనపై మోత్కుపల్లి నర్సింహ్ములు తీవ్రంగా చలించిపోయారు. కెసిఆర్ చరిత్రలో ఈ ఘటన మాయనిమచ్చ అవుతోందన్నారు. ఈ ఘటనకు బాధ్యుడిని చేస్తూ ఎస్ఐ రవీందర్‌ను సస్పెండ్ చేశారని చెప్పారు. ఎస్ఐ రవీందర్‌పై విధించిన సస్పెన్షన్‌ను ఎత్తివేయాలని ఆయన డిమాండ్ చేశారు.

Mothkupally Narsimhulu demand to lift suspension on Si Ravinder

ఇసుకదోపిడి చేస్తోంటే మైనింగ్ మాఫియా అనకుండా ఏం చేయాలని ఆయన ప్రశ్నించారు. మైనింగ్ మంత్రిగా కెటిఆర్‌కు బాధ్యత లేదా అంటూ ఆయన ప్రశ్నించారు. విదేశాల్లో వ్యాపారానికి అడ్డు తగులుతున్నారనే నెపంతోనే నేరేళ్ళలో దళితులను చితకబాదారని తెలంగాణ టిడిపి వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ ఆరోపించారు.

కరీంనగర్ జైలు సూపరింటెండ్, బిజెపి నేతలు ఆదుకోకపోతే తాము బతికే వారేమే కాదని బాధితులు మంత్రికి చెప్పారని ఆయన గుర్తుచేశారు. ఇసుక లారీలతో ఎంతమంది చనిపోయారో తెలుసా అంటే మంత్రి సమాధానం చెప్పలేదని బాధితులు చెప్పారన్నారు మోత్కుపల్లి.ఇసుక లారీలను అడ్డుకొంటున్నందుకే కక్షకట్టి రాజకీయ కుట్రకు బలిచేశారని ఆయన ఆరోపించారు.

English summary
Telangana Tdp leader mothkupally Narsimhulu demanded to lift suspention on Si Ravinder. Warangal Range IG Nagi reddy suspended SI Ravinder five days back on the report of DIG Ravivarma.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X