ఉత్తమ్ గడ్డం జడలు కట్టినా.. అది జరిగే పని కాదు : కవిత
నిజామాబాద్ : తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చేంత వరకు.. తాను గడ్డం తీసేది లేదని తెలంగాణ పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి శపథం చేసిన సంగతి తెలిసిందే. దీనిపై ఇప్పటికే అటు సోషల్ మీడియాలో పలు సెటైర్లు వినిపిస్తుండగా.. తాజాగా అధికారిక పార్టీ నేతలు కూడా ఉత్తమ్ గడ్డం శపథాన్ని చులకన వ్యాఖ్యలతో ఎద్దేవా చేస్తున్నారు.
తాజాగా ఉత్తమ్ గడ్డంపై శపథంపై స్పందించిన టీఆర్ఎస్ ఎంపీ కవిత.. 'ఉత్తమ్ కుమార్ రెడ్డి గడ్డం జడలు కట్టినా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాలేదని' ఎద్దేవా చేశారు. నిజామాబాద్ లోని ముప్కాల్ మండలం వేంపల్లి గ్రామంలో పర్యంటిచిన సందర్భంగా కవిత ఈ వ్యాఖ్యలు చేశారు. నిజాం షుగర్స్ ను తెరిపిస్తామంటున్న తెలంగాణ కాంగ్రెస్ నేతలపై మండిపడుతూ.. నిజాం షుగర్స్ ను తమ ప్రభుత్వం తెరిపిస్తుందని, తెలంగాణ ప్రభుత్వం ప్రజా సంక్షేమానికి కట్టుబడి ఉందని స్పష్టం చేశారు.