విజయారెడ్డికి కేక్ తినిపించిన కవిత: ‘స్కౌట్ అండ్ గైడ్స్ క్యాడెట్లకు రిజర్వేషన్లు’(పిక్చర్స్)
హైదరాబాద్: దివంగత నేత పి జనార్ధన్ రెడ్డి జయంతి వేడుకలు మంగళవారం ఘనంగా జరిగాయి. ఖైరతాబాద్ గణేశ్ చౌరస్తాలో జరిగిన కార్యక్రమంలో రాజ్యసభ సభ్యుడు కే కేశవరావు, నిజామాబాద్ ఎంపి కల్వకుంట్ల కవిత పాల్గొన్నారు. ఈ సందర్భంగా పిజెఆర్ చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.
అనంతరం కేక్ కట్ చేసిన కవిత.. పిజెఆర్ కూతురు విజయారెడ్డికి కేక్ తినిపించారు. ఈ సందర్భంగా విజయారెడ్డి రక్తదానం చేశారు. పిజెఆర్ అభిమానులు పిజెఆర్ అమర్ రహే...అంటూ నినదించారు. ఈ కార్యక్రమంలో ఖైరతాబాద్ నియోజక వర్గం టిఆర్ఎస్ ఇంఛార్జ్ మన్నె గోవర్ధన్ రెడ్డి, గద్వాల్ విజయ తదితరులు పాల్గొన్నారు.
స్కౌట్ అండ్ గైడ్స్ క్యాడెట్లకు రిజర్వేషన్లు
ఎన్సీసీ తరహాలో విద్య, ఉపాధి కల్పనకు స్కౌట్ అండ్ గైడ్స్ క్యాడెట్లకు రిజర్వేషన్ల కల్పనకు కృషి చేస్తామని నిజామాబాద్ ఎంపీ, భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ తెలంగాణ చీఫ్ కమిషనర్ కల్వకుంట్ల కవిత తెలిపారు. ఇటీవల ఛత్తీస్గఢ్లో జరిగిన జంబోరి ముఖద్వారం విభాగంలో నిర్వహించిన పోటీలో సింగరేణి కాలరీస్ డిస్ట్రిక్ట్ స్కౌట్స్ అండ్ గైడ్స్ విద్యార్థులకు ప్రథమ బహుమతి లభించింది.
ఈ నేపథ్యంలో పోటీలో పాల్గొన్న 41 మంది విద్యార్థులకు మంగళవారం తెలంగాణ భవన్లో మెమొంటో, ప్రశంసాపత్రాల ప్రదాన కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించారు. స్కౌట్స్ అండ్ గైడ్స్ బలోపేతానికి ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు. అందుకు ప్రైవేట్ స్కూళ్ల యాజమాన్యాలతో చర్చిస్తున్నట్లు తెలిపారు.
పిజెఆర్ జయంతి వేడుకలో కవిత
దివంగత నేత పి జనార్ధన్ రెడ్డి జయంతి వేడుకలు మంగళవారం ఘనంగా జరిగాయి.
పిజెఆర్ జయంతి వేడుకలో కవిత
ఖైరతాబాద్ గణేశ్ చౌరస్తాలో జరిగిన కార్యక్రమంలో రాజ్యసభ సభ్యుడు కే కేశవరావు, నిజామాబాద్ ఎంపి కల్వకుంట్ల కవిత పాల్గొన్నారు.
పిజెఆర్ జయంతి వేడుకలో కవిత
ఈ సందర్భంగా పిజెఆర్ చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.
పిజెఆర్ జయంతి వేడుకలో కవిత
అనంతరం
కేక్
కట్
చేసిన
కవిత..
పిజెఆర్
కూతురు
విజయారెడ్డికి
కేక్
తినిపించారు.
ఈ
సందర్భంగా
విజయారెడ్డి
రక్తదానం
చేశారు.
పిజెఆర్ జయంతి వేడుకలో కవిత
పిజెఆర్ అభిమానులు పిజెఆర్ అమర్ రహే...అంటూ నినదించారు. ఈ కార్యక్రమంలో ఖైరతాబాద్ నియోజక వర్గం టిఆర్ఎస్ ఇంఛార్జ్ మన్నె గోవర్ధన్ రెడ్డి, గద్వాల్ విజయ తదితరులు పాల్గొన్నారు.
స్కౌట్స్ అండ్ గైడ్స్
ఎన్సీసీ తరహాలో విద్య, ఉపాధి కల్పనకు స్కౌట్ అండ్ గైడ్స్ క్యాడెట్లకు రిజర్వేషన్ల కల్పనకు కృషి చేస్తామని నిజామాబాద్ ఎంపీ, భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ తెలంగాణ చీఫ్ కమిషనర్ కల్వకుంట్ల కవిత తెలిపారు.
స్కౌట్స్ అండ్ గైడ్స్
ఇటీవల ఛత్తీస్గఢ్లో జరిగిన జంబోరి ముఖద్వారం విభాగంలో నిర్వహించిన పోటీలో సింగరేణి కాలరీస్ డిస్ట్రిక్ట్ స్కౌట్స్ అండ్ గైడ్స్ విద్యార్థులకు ప్రథమ బహుమతి లభించింది.
స్కౌట్స్ అండ్ గైడ్స్
ఈ నేపథ్యంలో పోటీలో పాల్గొన్న 41 మంది విద్యార్థులకు మంగళవారం తెలంగాణ భవన్లో మెమొంటో, ప్రశంసాపత్రాల ప్రదాన కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించారు.
స్కౌట్స్ అండ్ గైడ్స్
స్కౌట్స్ అండ్ గైడ్స్ బలోపేతానికి ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు. అందుకు ప్రైవేట్ స్కూళ్ల యాజమాన్యాలతో చర్చిస్తున్నట్లు తెలిపారు.
స్కౌట్స్ అండ్ గైడ్స్
విద్యార్థులకు మెరుగైన శిక్షణ ఇచ్చేందుకు చర్యలు తీసుకోవాలని స్కౌట్స్ అండ్ గైడ్స్ నిర్వాహకులకు సూచించారు.
స్కౌట్స్ అండ్ గైడ్స్
ఛత్తీస్గఢ్ జంబోరిలో సింగరేణి విద్యార్థులకు ప్రథమ బహుమతి రావడం సంతోషకరం అన్నారు. త్వరలోనే తెలంగాణలోనూ జంబోరి నిర్వహిద్దామని కవిత చెప్పారు.
స్కౌట్స్ అండ్ గైడ్స్
ఈ కార్యక్రమంలో భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి చంద్రశేఖర్, సహాయ కార్యదర్శి జాన్ సామ్యేల్, గైడ్స్ ట్రైనింగ్ కమిషనర్ సుగుణా రాజేంద్రం, సింగరేణి కాలరీస్ కంపెనీ కార్యదర్శి శంకర్నాయక్, సింగరేణి డిస్ట్రిక్ట్ స్కౌట్స్ అండ్ గైడ్స్ కమినర్ ఆర్వీ సత్యనారాయణ, జిల్లా శిక్షణ కమిషనర్ జేవీ కృష్ణారావు, స్కౌట్ మాస్టర్లు సాయి నిరంజన్, మంచాల వరలక్ష్మి, తదితరులు పాల్గొన్నారు.