ఎస్సీ వర్గీకరణ కోసం ఎమ్మార్పీఎస్ ధర్నా: మహిళ మృతి, అసెంబ్లీలో విపక్షాల ఆందోళన
ఎస్సీ వర్గీకరణపై ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ ఎంఆర్పిఎస్ కార్యకర్తలు హైద్రాబాద్ కలెక్టరేట్ను సోమవారం నాడు ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాలో అపశృతి చోటుచేసుకొంది.
హైదరాబాద్: ఎస్సీ వర్గీకరణపై ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ ఎంఆర్పిఎస్ కార్యకర్తలు హైద్రాబాద్ కలెక్టరేట్ను సోమవారం నాడు ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాలో అపశృతి చోటుచేసుకొంది. ఈ సందర్భంగా చోటుచేసుకొన్న తోపులాటలో ఓ మహిళ తీవ్రంగా గాయపడింది. ఆమెను ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు.అయితే ఆసుపత్రికి తరలించిన సమయంలోనే మహిళ కార్యకర్త భారతి మరణించింది.
ఎస్సి వర్గీకరణపై ఢిల్లీకి అఖిలపక్షాన్ని తీసుకెళ్ళాలని డిమాండ్ చేస్తూ ఎంఆర్పిఎస్ కార్యకర్తలు ఆందోళన నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో భాగంగా హైద్రాబాద్ కలెక్టరేట్ వద్ద ఎంఆర్పిఎస్ కార్యకర్తలు ఆందోళన నిర్వహించారు. ఈ ఆందోళనలో పోలీసులకు, ఎంఆర్పిఎస్ కార్యకర్తలకు మధ్య తోపులాట చోటుచేసుకొంది.
ఈ సమయంలో భారతి అనే మహిళ కార్యకర్త స్పృహ తప్పిపోయింది. ఆమె పరిస్థితి విషమంగా ఉంది. వెంటనే ఆమెను వెంటనే ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు.
ఆసుపత్రికి తరలించిన వెంటనే వైద్యులు ఆమెను పరీక్షించి చనిపోయినట్టు ప్రకటించారు.అయితే ఈ విషయాన్ని అసెంబ్లీలో విపక్షనేత జానారెడ్డి ప్రస్తావించారు.
భారతి మృతిపై అసెంబ్లీలో ప్రకటన చేయాలని బిజెపి శాసనసభపక్ష నేత కిషన్రెడ్డి అసెంబ్లీలో ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
భారతి ఫిట్స్తో చనిపోయిందని మంత్రి ఈటెల రాజేందర్ ప్రకటించారు. అయితే ఈ ఘటనపై రాష్ట్ర సీఎం కెసిఆర్ ప్రకటన చేస్తారని హోం మంత్రి నాయిని నర్సింహ్మరెడ్డి ప్రకటించారు