నిన్న పవన్... నేడు దత్తాత్రేయ: దాసరి బాగుంటేనే... మురళీ మోహన్
కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న దాసరి నారాయణ రావు కోలుకుంటున్నారు.
హైదరాబాద్: కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న దాసరి నారాయణ రావు కోలుకుంటున్నారు. ఆయనకు గురువారం నాడు వెంటిలెటర్ తీసేశారు. మరోవైపు, ఆయనను కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ, టిడిపి ఎంపీ మురళీ మోహన్ తదితరులు పరామర్శించారు.
దాసరి నారాయణ రావు ఆరోగ్యంపై మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్
దాసరిని పరామర్శించిన అనంతరం దత్తాత్రేయ విలేకరులతో మాట్లాడారు. ఆయన వేగంగా కోలుకుంటున్నారని చెప్పారు. ఇందుకు చాలా సంతోషంగా ఉందని చెప్పారు. నటుడు తరుణ్ కూడా పరామర్శించారు.
గురువుగారిని చూడగానే ఆనందించా: మురళీ మోహన్
గురువుగారిని చూడగానే ఆనందించానని ఎంపీ మురళీ మోహన్ అన్నారు. మురళీ మోహన్.. దాసరి కుటుంబసభ్యులను పరామర్శించి ఆరోగ్య పరిస్థితి అడిగి తెలుసుకున్నారు.
అనంతరం విలేకరులతో మాట్లాడారు. దాసరి కోలుకుంటున్నారని.. ఆయన ఆరోగ్య పరిస్థితి మెరుగుపడుతోందన్నారు. దాసరి బాగుంటేనే సినీ పరిశ్రమ బాగుంటుందన్నారు. ఆయన త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తూ రేపు ఫిల్మ్నగర్ దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తామన్నారు.
కాగా, బుధవారం నాడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ దాసరిని పరామర్శించారు. ఆయన మాట్లాడుతూ.. దాసరి ఆరోగ్యంపై వైద్యులు నమ్మకంగా ఉన్నారని చెప్పారు. గురువారం వెంటిలెటర్లు తొలగించనున్నట్లు చెప్పారన్నారు. ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.