మోసం చేశారు: 13మంది ‘శ్రీనాగ్’ డైరెక్టర్లపై నాగ సుశీల ఫిర్యాదు, నాగార్జున జోక్యం చేసుకున్నా!
తనను వ్యాపారంలో మోసం చేశారంటూ శ్రీనాగ్ ప్రొడక్షన్ మేనేజింగ్ పార్ట్నర్ చింతలపూడి శ్రీనివాస్ తోపాటు మరో 13మంది డైరెక్టర్లపై పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు ప్రముఖ నటుడు నాగార్జున సోదరి నాగ .
Recommended Video
హైదరాబాద్: తనను వ్యాపారంలో మోసం చేశారంటూ శ్రీనాగ్ ప్రొడక్షన్ మేనేజింగ్ పార్ట్నర్ చింతలపూడి శ్రీనివాస్ తోపాటు మరో 13మంది డైరెక్టర్లపై పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు ప్రముఖ నటుడు నాగార్జున సోదరి నాగ సుశీల. ఈ కంపెనీలో ఆమె కూడా ఓ భాగస్వామి.
మోసం చేశారంటూ..
కంపెనీ నిధులను తన సొంత ఖాతాలకు బదలాయించుకున్నారని శ్రీనివాస్పై ఆమె ఫిర్యాదు చేశారు. అంతేగాక, తనకు సంబంధించిన గండిపేటలోని భూమిని తనకు తెలియకుండా అమ్మేశాడని ఆమె తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆ డబ్బును కూడా తనకు ఇవ్వలేదని తెలిపారు.
13మందిపై కేసు..
నాగ సుశీల ఫిర్యాదు మేరకు శ్రీనివాస్ను విచారిస్తామని పోలీసులు చెబుతున్నారు. ఫిర్యాదులో 13మంది డైరెక్టర్లలలో శ్రీనివాస్, అతని భార్య, ఇతర బంధువులు ఉన్నారని తెలుస్తోంది. కాగా, ఈ కంపెనీకి సంబంధించిన ఓ కేసు ఇప్పటికే కోర్టులో విచారణ జరుగుతున్నట్లు తెలిసింది.
లాకప్లో పెట్టి నాచేత ఆస్తులు రాయించుకోవాలనే: నాగసుశీలపై చింతలపూడి సంచలనం
ఆర్థిక లావాదేవీలే..
కాగా, శ్రీనివాస్ తరపు న్యాయవాది మాట్లాడుతూ.. కోర్టులో ఈ కంపెనీకి సంబంధించి సివిల్ కేసు విచారణలో ఉందని తెలిపారు. కంపెనీ ఆర్థిక లావాదేవీలపపై ఏడాదిగా వివాదాలు కొనసాగుతున్నాయని చెప్పారు. శ్రీనాగ్ నిర్మాణంలో ఆరు సినిమాలు తీశామని, సుమారు వందకోట్ల వరకు నష్టం వచ్చిందని శ్రీనివాస్ తరపు న్యాయవాది చెప్పారు.
నాగార్జున జోక్యం
ఇది ఇలావుంటే, నటుడు నాగార్జున ఈ వివాదంలో జోక్యం చేసుకుని నాగ సుశీల, శ్రీనివాస్ల సయోధ్య కుదిర్చారని తెలిసింది. అయినా కూడా వీరి మధ్య విబేధాలు మాత్రం చల్లారలేదని తాజా ఫిర్యాదుతో తేలింది. అయితే, తాను ఎలాంటి మోసాలకు పాల్పడలేదని శ్రీనివాస్ చెబుతుండటం గమనార్హం.