వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కెసిఆర్‌కు కామన్సెన్స్ ఉందా: నాగం హావభావాలు (పిక్చర్స్)

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు, మంత్రుల పైన బిజెపి నేత నాగం జనార్ధన్ రెడ్డి మంగళవారం నిప్పులు చెరిగారు.

తెలంగాణ ద్రోహులను పక్కన కూర్చోపెట్టుకొని కెసిఆర్ ప్రభుత్వాన్ని నడిపిస్తున్నారని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో మంత్రులు ఉన్నప్పటికీ మూగజీవాలతో సమానమయ్యారన్నారు.

తన ఫాం హౌస్‌కు రక్షణగా ఉంటారని సమీప ఎర్రవల్లి గ్రామస్తులకు కెసిఆర్ ఇళ్లు కట్టిస్తానని హామీ ఇచ్చారని ఎద్దేవా చేశారు. లోపలేస్తామని తలసాని శ్రీనివాస్ వ్యతిరేకిస్తున్నారని, ఎవర్ని పెడతారో పెట్టాలని, ప్రతి రైతు ప్రశ్నించే రోజు వస్తుందన్నారు.

నాగం

నాగం

వాటర్ గ్రిడ్ ప్రాజెక్టులో అవినీతిని నిరూపిస్తానని, లేనిపక్షంలో తాను రాజకీయాల నుంచి తప్పుకుంటానని నాగం జనార్ధన్ రెడ్డి సవాల్ చేశారు.

నాగం

నాగం

కెసిఆర్‌కు కామన్సెన్స్ ఉండాలని, నూనె లేకుండా జ్యోతి వెలుగుతుందా, గ్రామజ్యోతికి ఖజానా నుంచి అదనంగా ఒక్క రూపాయి కూడా రావడం లేదన్నారు. డబ్బుల్లేకుండా పనులు ఎలా చేయాలన్నారు.

నాగం

నాగం

నాగం మంగళవారం రంగారెడ్డి జిల్లాలో రైతు భరోసా యాత్ర నిర్వహించారు. కెసిఆర్ ప్రాతినిథ్యం వహిస్తున్న గజ్వెల్ నియోజకవర్గంలోను తాను త్వరలో పర్యటిస్తానని నాగం చెప్పారు.

నాగం

నాగం

గజ్వెల్ నియోజకవర్గంలో రైతు ఆత్మహత్యలు ముఖ్యమంత్రికి కనిపించడం లేదా అని ప్రశ్నించారు. కెసిఆర్ 8వ నిజాంలాగా, ఆయన అనుచరులు రజాకారుల్లా వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు.

English summary
BJP leader Nagam Janadhran Reddy lashes out at KCR and ministers
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X