వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఘోర ప్రమాదం: లారీని ఢీకొన్న ఆటో, ఆరుగురు మృతి, 10 మందికి గాయాలు

|
Google Oneindia TeluguNews

నల్గొండ: జిల్లాలోని పెద్ద అడిశర్లపల్లి మండలం అంగడిపేట వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కూలీలతో వెళ్తున్న ఆటో.. బొలోరో వాహనాన్ని తప్పించబోయి ఎదురుగా వస్తున్న లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆరుగురు మృతి చెందారు.
మృతుల్లో ఆటో డ్రైవర్ సహా ఆరుగురు మహిళలున్నారు.

Recommended Video

Chittoor: కుప్పం వెళ్తూ ప్రమాదానికి: చిత్తూరు జిల్లాలో రోడ్డు ప్రమాదం

మృతులను చెన్నంపేట మండలంలోని సుద్దబావితండాకు చెందినవారిగా గుర్తించారు. మరో 10 మందికి తీవ్రగాయాలయ్యాయి. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను దేవరకొండ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశముందని అంటున్నారు.

Nalgonda: six killed in a road accident, 10 injured

కూలీలు వరినాట్ల కోసం రంగారెడ్డిగూడెం వెళ్లి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదం జరిగిన సమయంలో ఆటోలో 21 మంది ఉన్నట్లు సమాచారం. ఘటనా స్తలాన్ని దేవరకొండ డీఎస్పీ ఆనంద్ రెడ్డి పరిశీలించారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

మృతి చెందినవారిలో ఆటో డ్రైవర్ మల్లేశం, నోమల పెద్దమ్మ, నోమల సైదమ్మ, కొట్టం పెద్దమ్మ, గొడుగు ఇద్దమ్మ, మల్లమ్మ ఉన్నారు. ఆరుగురి మృతితో సుద్దబావితండాలో విషాదం నెలకొంది.

English summary
Nalgonda: six killed in a road accident, 10 injured
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X