వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఉక్రెయిన్‌లో నల్గొండ విద్యార్థి మృతి: దుబాయ్‌లో వికారాబాద్ యువకుడు

|
Google Oneindia TeluguNews

నల్గొండ: జిల్లాకు చెందిన ఓ విద్యార్థి ఉక్రెయిన్‌లో అనారోగ్యంతో మృతి చెందాడు. జిల్లాలోని రామన్నపేట మండలం దుబ్బాక మధిర గ్రామమైన రెంటకోలుకు చెందిన దేవరపల్లి భిక్షంరెడ్డి సూర్యకళ దంపతుల కొడుకు దేవరపల్లి శ్రీకాంత్‌రెడ్డి(26) ఉక్రెయిన్‌లో ఉంటున్నాడు.

ఉక్రెయిన్‌లోని జపరోజ్‌హియా స్టేట్ మెడికల్ యూనివర్సిటీలో ఎంబీబీఎస్ తృతీయ సంవత్సరం చదువుతున్నాడు. వారం కిందట న్యూమోనియాతో బాధపడుతూ అనారోగ్యానికి గురై అదే యూనివర్సిటీలోని ఆస్పత్రిలో చేరాడు.

చికిత్స పొందుతూ బుధవారం మృతిచెందాడు. యూనివర్సిటీ అధికారులు రెంటకోలులో ఉన్న తల్లిదండ్రులకు సమాచారం అందించారు. కొడుకు మృతి ఆ కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

Nalgonda student died in Ukraine

దుబాయ్‌లో వికారాబాద్ యువకుడు మృతి

దుబాయ్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో రంగారెడ్డి జిల్లా వికారాబాద్ పరిధిలోని కొత్తగడికి చెందిన ప్రసాద్ కుమార్ (25) మృతి చెందాడు. గ్రామానికి చెందిన సిరిపురం నర్సింహులు, లక్ష్మి దంపతులకు ప్రసాద్, లావణ్య, అమ్ములు సంతానం. కుటుంబ పరిస్థితి బాగా లేకపోవడంతో ప్రసాద్ మే 22న బంధువుల సహాయంతో దుబాయ్ వెళ్లాడు.

20 రోజుల క్రితం కుటుంబసభ్యులతో ఫోన్‌లో మాట్లాడి క్షేమంగానే ఉన్నానని, పని దొరికిందని చెప్పాడు. గురువారం తెల్లవారుజామున ప్రసాద్ మృతుడి చెందాడంటూ దుబాయ్‌లో ఉన్న బంధువుల ద్వారా తల్లిదుండ్రులకు సమాచారం అందింది. కుటుంబానికి ఆధారంగా ఉన్న కొడుకు మృతి చెందడంతో ఆ కుటుంబం కన్నీరుమున్నీరైంది.

English summary
Nalgonda student died in Ukraine and Vikarabad youth in Dubai.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X