వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మీతో తలనొప్పి: మీడియా ప్రతినిధులపై నారా లోకేష్ అసహనం

By Pratap
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: మీడియా ప్రతినిధుల పట్ల తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి తనయుడు నారా లోకేష్ అసహనం వ్యక్తం చేశారు. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్‌ఎంసీ) ఎన్నికల్లో చంద్రబాబు కుటుంబ సభ్యులు నారా లోకేష్, ఆయన సతీమణి, చంద్రబాబు సతీమణి భువనేశ్వరి మంగళవారం ఓటు హక్కును వినియోగించుకున్నారు.

పోలింగ్ బూత్ నుంచి బయటకు వచ్చిన లోకోష్‌ను మీడియా ప్రతినిధులు కలిసేందుకు దగ్గరకు వచ్చారు. ముగ్గురి ఫోటోలను తీసుకునేందుకు ప్రయత్నించారు. ఈ సందర్బంలో లోకేష్ వారిపట్ల కాస్తా అసహనం వ్యక్తం చేసారు.

మీతో తలనొప్పి అని వ్యాఖ్య చేశారు. ఓటింగ్ శాతం పెంచండని విజ్ఙప్తి చేయండి సార్ అని విలేకరులు చేసిన విజ్ఞప్తిపై చిరాకు పడ్డారు. అవసరంలేదంటూ తన మానాన తాను వెళ్లిపోయారు. అయితే, ఓటింగ్ శాతం తక్కువగా ఉండడం పట్ల ఆయన ట్విట్టర్‌లో ఆందోళన వ్యక్తం చేశారు.

గ్రేటర్‌లో ఓటింగ్‌ శాతం తగ్గుదలపై టీడీపీ జాతీయ ప్రధానకార్యదర్శి లోకేష్‌ ఆందోళన వ్యక్తం చేశారు. ప్రతి ఒక్కరూ మీ ఓటు హక్కును వినియోగించుకోవాలంటూ ఆయన ఆకాంక్షించారు. హైదరాబాద్‌ భవిష్యత్‌ మీ చేతుల్లోనే ఉందంటూ ట్విట్టర్‌లో నారా లోకేష్‌ ట్వీట్ చేశారు.

English summary
Telugu Desam party (TDP) leader Nara Lokesh expressed unhappy with media reporters in Hyderabad during GHMC elections polling.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X