మీతో తలనొప్పి: మీడియా ప్రతినిధులపై నారా లోకేష్ అసహనం
హైదరాబాద్: మీడియా ప్రతినిధుల పట్ల తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి తనయుడు నారా లోకేష్ అసహనం వ్యక్తం చేశారు. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) ఎన్నికల్లో చంద్రబాబు కుటుంబ సభ్యులు నారా లోకేష్, ఆయన సతీమణి, చంద్రబాబు సతీమణి భువనేశ్వరి మంగళవారం ఓటు హక్కును వినియోగించుకున్నారు.
పోలింగ్ బూత్ నుంచి బయటకు వచ్చిన లోకోష్ను మీడియా ప్రతినిధులు కలిసేందుకు దగ్గరకు వచ్చారు. ముగ్గురి ఫోటోలను తీసుకునేందుకు ప్రయత్నించారు. ఈ సందర్బంలో లోకేష్ వారిపట్ల కాస్తా అసహనం వ్యక్తం చేసారు.
Exercise your right to vote wisely. To show your support, click a selfie showing you voted & hashtag it with #HydVotes
— Lokesh Nara (@naralokesh) February 2, 2016
మీతో తలనొప్పి అని వ్యాఖ్య చేశారు. ఓటింగ్ శాతం పెంచండని విజ్ఙప్తి చేయండి సార్ అని విలేకరులు చేసిన విజ్ఞప్తిపై చిరాకు పడ్డారు. అవసరంలేదంటూ తన మానాన తాను వెళ్లిపోయారు. అయితే, ఓటింగ్ శాతం తక్కువగా ఉండడం పట్ల ఆయన ట్విట్టర్లో ఆందోళన వ్యక్తం చేశారు.
Voting % is lower than 2014 elections! Your vote determines the future of Hyderabad. Let's Vote. #GHMCElections
— Lokesh Nara (@naralokesh) February 2, 2016
గ్రేటర్లో ఓటింగ్ శాతం తగ్గుదలపై టీడీపీ జాతీయ ప్రధానకార్యదర్శి లోకేష్ ఆందోళన వ్యక్తం చేశారు. ప్రతి ఒక్కరూ మీ ఓటు హక్కును వినియోగించుకోవాలంటూ ఆయన ఆకాంక్షించారు. హైదరాబాద్ భవిష్యత్ మీ చేతుల్లోనే ఉందంటూ ట్విట్టర్లో నారా లోకేష్ ట్వీట్ చేశారు.