నరేంద్రమోడీ, అమిత్ షాలు తెలంగాణ ఏర్పాటుపై చేసిన వ్యాఖ్యలు బేషరతుగా ఉపసంహరించుకోవాలి : సీఎం కేసీఆర్
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై ప్రధానమంత్రి మోడీతో పాటు కేంద్ర హోంమంత్రి అమిత్ షా తమ వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలని సీఎం కేసీఆర్ డిమాండ్ చేశారు. తెలంగాణ ప్రజల ప్రతినిధిగా తాను ఈ వ్యాఖ్యలు చేస్తున్నట్టు ప్రకటించారు. ఈ నేపథ్యంలోనే తెలంగాణ ప్రజలపట్ల వాళ్ల వైఖరి మార్చుకోవాలని ఆయన కోరారు. 60 సంవత్సరాల పోరాటం ద్వార తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసుకున్నామని అయన స్ఫష్టం చేశారు.
ఇటివల లోక్సభ ఎన్నికల ప్రచారంతోపాటు అంతకు ముందు కూడ తెలంగాణ ఏర్పాటు పై ప్రధానమంత్రి మోడీ పలుసార్లు వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలోనే తల్లిని చంపి బిడ్డను బ్రతికించారని పేర్కోన్నారు, మరోవైపు కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలంగాణ ఏర్పాటును ఒక బ్లాక్ డేగా అభివర్ణించారు. ఆర్టికల్ 370 రద్దులో భాగంగా జమ్ము కశ్మీర్ పునర్విభజన చేపట్టే సమయంలో కూడ ఆయన నిర్భంధంగా తెలంగాణ ఏర్పాటును చేశారని పార్లమెంట్ లో వాదించారు. అయితే ఆయన చేసిన వ్యాఖ్యలను కాంగ్రెస్ పార్టీ వెంటనే ఖండించింది. సంవత్సరం పాటు ఇరు రాష్ట్రాల నేతలలో సంప్రదింపులు జరిపిన తర్వాతే తెలంగాణ ఏర్పాటు జరిగిందని చెప్పారు.
ఈనేపథ్యంలోనే సీఎం కేసిఆర్ ప్రధాని మోడితో పాటు, అమిత్ షా చేసిన వ్యాఖ్యల ఫైర్ అయ్యారు. ఇద్దరు నేతలు చేసిన వ్యాఖ్యలు బేషరుతుగా వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని అవమాన పరిచేవిధంగా భవిష్యత్లో ఇలాంటీ వాఖ్యానించకుడదని కోరారు. అమిత్ షా చేసిన వ్యాఖ్యలు విత్ డ్రా చేయాలని చేసుకోవాలని కోరారు. అరవై సంవత్సరాలు కొట్లాడి తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చుకున్నామని మరోసారి స్పష్టం చేశారు. తెలంగాణను ఎవ్వరు ముందుకు వచ్చి ఇవ్వలేదని అన్నారు. తెలంగాణ బెడ్జెట్ చివరి రోజు సమావేశంలో భాగంగా సీఎం కేసిఆర్ ప్రసగించారు.