వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఎంపీ కవితకు సీఎం నవీన్ ప్రశంస: ఎందుకంటే..?

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌: ద్విచక్ర వాహనాల రోడ్డు ప్రమాదాల నివారణకు హెల్మెట్ వాడకంపై దేశవ్యాప్త ప్రచార కార్యక్రమాన్ని చేపట్టిన నిజామాబాద్‌ టీఆర్ఎస్ ఎంపీ కల్వకుంట్ల కవితను ఒడిశా సీఎం నవీన్‌ పట్నాయక్‌ అభినందించారు. ఎంతో ముఖ్యమైన సందేశంతో ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టడం ప్రశంసనీయమన్నారు. దీనికి తాను సంపూర్ణ మద్దతు ఇస్తున్నానని, అందరూ ఇందులో పాల్గొనాలని ఆయన బుధవారం ట్విట్టర్‌లో పిలుపునిచ్చారు.

రాఖీపండుగ సందర్భంగా రాఖీ కట్టడంతోపాటు సోదరులకు హెల్మెట్ బహుమతిగా ఇవ్వాలని 'గిఫ్ట్ ఏ హెల్మెట్' అనే ప్రచారానికి ఎంపీ కవిత శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. ఇప్పటికే పలువురు ఎంపీలు ఈ ప్రచారానికి మద్దతు తెలుపగా, తాజాగా ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ సైతం దీనిపై స్పందించారు.

'రహదారి భద్రత విషయంలో ఎంపీ కవిత చేసిన ప్రచారం చాలా ఉన్నతమైనది. ఈ గొప్ప ప్రచారంలో అందరూ భాగస్వాములై సమాజంలో అవగాహన కల్పించాలని కోరుతున్నా' అని ట్వీట్ చేశారు.

దీనికి స్పందించిన ఎంపీ కవిత ధన్యవాదాలు చెప్తూ రీట్వీట్ చేశారు. 'మీ ఆశీర్వాదాలు, మద్దతు చాలా సంతోషకరం సర్. ఒడిశాకు చెందిన అనేకమంది అక్కాచెల్లెళ్లు ఈ ఉన్నత కార్యక్రమంలో పాలుపంచుకుంటారని భావిస్తున్నా' అని పేర్కొన్నారు.

English summary
Odisha CM Naveen Patnaik praised MP Kalvakuntla Kavitha for sister 4 change programme.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X