నీట్-2018 ఫలితాలు: అమేజింగ్.. కల్పనకు 99.99 శాతం, రెండో స్థానంలో తెలంగాణ రోహన్
న్యూఢిల్లీ: ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సుల్లో వైద్య విద్య ప్రవేశాల కోసం నిర్వహించిన నీట్ 2018 పరీక్ష ఫలితాలు సోమవారం విడుదలయ్యాయి. నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రెన్స్ టెస్ట్ (నీట్)లో ఢిల్లీకి చెందిన కల్పనా కుమారి టాపర్గా నిలిచింది. 99.99 పర్సెంటేజ్ సాధించింది. కల్పనా కుమారి బీహార్కు చెందిన విద్యార్థిని. ఢిల్లీలో పరీక్షల కోసం శిక్షణ తీసుకుంది.
సెంట్రల్ బోర్డ్ ఆప్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) ప్రకారం ఆమె 99.99 శాతం పర్సంటేజ్ సాధించింది. కల్పనా కుమారి ఫిజిక్స్లో 180కి గాను 171, కెమిస్ట్రీలో 160, బయోలజీలో 360కి 360 మార్కులు సాధించింది. బోటనీ, జూవాలజీ.. రెండింటిలో 720 మార్కులకు గాను 691 మార్కులు సాధించింది.
తెలంగాణ రాష్ట్రానికి చెందిన రోహన్ పురోహిత్కు రెండో ర్యాంకు, ఢిల్లీకి చెందిన హిమాన్షు శర్మకు మూడో ర్యాంకు వచ్చింది. గత ఏడాదికి నీట్కు 11.5 లక్షల మంది రిజిస్టర్ చేసుకుంటే ఈసారి 13 లక్షలమంది రిజిస్టర్ చేసుకున్నారు. దేశవ్యాప్తంగా మెడికల్, డెంటల్ సంస్థలలో 60,000 ఖాళీలు ఉంటాయి.
ఫలితాలను ఈ వెబ్ సైట్లో చూసుకోవచ్చు... cbseresults.nic.in