‘కేసీఆర్కు భారతరత్న ఇవ్వాల్సిందే’
అలుపెరుగని పోరాటంతో స్వరాష్ట్రాన్ని సాధించిన తెలంగాణ ముఖ్యమంత్రి, తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకు భారతరత్న ఇవ్వాలనే డిమాండ్ ఇప్పుడు తెరపైకి వచ్చింది.
హైదరాబాద్: అలుపెరుగని పోరాటంతో స్వరాష్ట్రాన్ని సాధించిన తెలంగాణ ముఖ్యమంత్రి, తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకు భారతరత్న ఇవ్వాలనే డిమాండ్ ఇప్పుడు తెరపైకి వచ్చింది.
భారతరత్నమే..
ఈ మేరకు కేసీఆర్ భారత్రత్న బనావో అభియాన్ సంస్థ వ్యవస్థాపక కన్వీనర్ తాహెర్ కమాల్ ఖుంద్మిరి, కో-ఆర్డినేటర్ కన్వీనర్ మీర్ ఇనాయత్అలీబాఖ్రీ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
కేసీఆర్ నేతృత్వంలోనే..
గురువారం హైదర్గూడలోని న్యూస్సెంటర్లో వారు మీడియాతో మాట్లాడారు. ఎంతో మంది ఉద్యమకారుల ఆత్మార్పణలతో కేసీఆర్ నేతృత్వంలో ప్రత్యేక రాష్ట్రం సిద్ధించిందని వారు గుర్తుచేశారు.
చరిత్రలో నిలిచిపోయారు..
తద్వారా తెలంగాణ సృష్టికర్తగా కేసీఆర్ చరిత్రలో నిలిచిపోయారని వారన్నారు. డాక్టర్ మర్రి చెన్నారెడ్డి సహా అనేకమంది నాయకులకు సాధ్యంకాని తెలంగాణ రాష్ట్రాన్ని కేసీఆర్ సాధించి చూపించారన్నారు.
కోటి సంతకాలు..
ఈ నేపథ్యంలో ఆయనకు భారతరత్న ఇవ్వడం సముచితమని వారు అభిప్రాయపడ్డారు. వచ్చే వారం కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని ప్రారంభించి అక్టోబరులో ప్రధానికి వినతిపత్రం అందజేస్తామని వారు పేర్కొన్నారు.