కొత్త ఐదొందల నోట్లు వస్తున్నాయి, కరెన్సీ కష్టాలు తీరనున్నాయి
ఈ వారాంతానికి కొత్త 500 రూపాయాల నోట్లు బ్యాంకులు, ఎటిఎం ల నుండి ప్రజలు తీసుకొనే అవకాశం ఉంది.వంద రూపాయాల నగదు మార్కెట్లో సరిపోను లేదు. కొత్తగా ఐదువందల నోటును అందుబాటులోకి తీసుకురావడం వల్ల కష్టాలు తప
హైదరాబాద్ :ఈ వారాంతంలో కొత్త నగదు కష్టాలు తీరే అవకాశాలున్నట్టు బ్యాంకు అధికారులు చెబుతున్నారు. ప్రజలకు అందుబాటులోకి మరిన్ని కొత్త నగదు రానుంది. కొత్తగా వచ్చిన 500 రూపాయాల నొటు ఎటిఎంలు, బ్యాంకుల ద్వారా ప్రజలకు అందుబాటులోకి రానుందని ఆర్ బి ఐ అధికారులు అభిప్రాయపడుతున్నారు.
పెద్ద నగదు నోట్లను రద్దు చేసిన తర్వాత తొలుత 2 వేల రూపాయాల నగదును అందుబాటులోకి వచ్చింది. 500 రూపాయాల కరెన్సీ కూడ ప్రజలకు అందుబాటులోకి వచ్చాయి. కాని, ఈ నగదు అంతగా ప్రజలకు అందుబాటులోకి రాలేదు.దీంతో ప్రజల కష్టాలు ఇంకా తీరలేదు.
ఈ వారంతంలోపుగా అన్ని నగరాలకు ఐదు వందల రూపాయాలు అందుబాటులోకి రానున్నాయి.కొత్త నగదు నోట్ల తరలించేందుకు హైలిక్యాప్టర్లను కూడ ఉపయోగిస్తున్నారు.ఈ శనివారం నాటికి ఐదువందల రూపాయలు ఎటిఎంలకు వచ్చే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.
ఐదువందల నోట్లు అందుబాటులోకి వస్తే సమస్య సగం తీరుతాయని అధికారులు అభిప్రాయపడుతున్నారు. బ్యాంకులు, ఎటిఎంలలో పెద్ద ఎత్తున ఐదు వందల నోట్లను తీసుకొనే అవకాశాన్ని ఏర్పాటు చేయనున్నారు. తద్వారా ఇబ్బందులను అధిగమించవచ్చని అధికారులు అభిప్రాయంతో ఉన్నారు.