చచ్చేదాకా కలిసుంటాం, అంతా తల్లిదండ్రుల వల్లే!: మధుప్రియ కేసులో ట్విస్ట్
హైదరాబాద్: సింగర్ మధుప్రియ, భర్త శ్రీకాంత్కు పోలీసులు ఇచ్చిన కౌన్సెలింగ్ ఫలితాన్ని ఇచ్చినట్లుగా కనిపిస్తోంది. బతికున్నంత కాలం తాము కలిసే జీవిస్తామని మధుప్రియ, శ్రీకాంత్లు సోమవారం ఓ టీవీ ఛానల్ ఇంటర్వ్యూలో చెప్పారు.
తన తల్లిదండ్రుల వల్లే ఇంత పెద్ద గొడవ జరిగిందని మధుప్రియ చెప్పారని తెలుస్తోంది. తన తల్లిదండ్రులతో పాటు మరికొంత మంది కుటుంబ సభ్యులు శ్రీకాంత్ గురించి తనకు నూరిపోశారని చెప్పారని తెలుస్తోంది. దీంతో, తాను అయోమయ పరిస్థితిలో పడ్డానని చెప్పారు.
మా ఆయన బంగారమే, కానీ...: సింగర్ మధుప్రియ, ఎపిసోడ్లో మరో ట్విస్ట్
పోలీసుల సమక్షంలో జరిగిన కౌన్సెలింగ్ అనంతరం వాస్తవ విషయాలు బోధపడ్డాయన్నారు. తన జీవితంలో శ్రీకాంత్కు తప్ప మరొకరికి స్థానం లేదని ఆమె పేర్కొన్నారు.
శ్రీకాంత్ మాట్లాడుతూ... మధుప్రియ తల్లిదండ్రులు తనను నమ్మించి తనపై దాడి చేశారన్నాడు. మధుప్రియ తల్లిదండ్రుల కారణంగానే ఇంత పెద్ద గొడవ జరిగిందన్నాడు. మధుప్రియతోనే కలిసి ఉంటానని చెప్పాడు. మరో రెండు దెబ్బలు గట్టిగా తగిలితే తాను చచ్చిపోయేవాడినని శ్రీకాంత్ చెప్పాడు.
రోజంతా డ్రామా: మధుప్రియ ట్విస్ట్, ఎందుకు? (పిక్చర్స్)
పెళ్లయినప్పటి నుంచి తాను చాలా జాగ్రత్తగా ఉన్నానని, తనను వాళ్ల కుటుంబ సభ్యుడనేలా నమ్మించారని, తనపై దాడి చేసేందుకు ఎప్పుడు అవకాశం దొరుకుతుందా? అని మధుప్రియ తల్లిదండ్రులు ఎదురు చూశారని శ్రీకాంత్ ఆరోపించాడు.
కాగా, తన భర్త వేధిస్తున్నాడంటూ హుమాయూన్ పోలీస్ స్టేషన్లో మధుప్రియ శనివారం రాత్రి ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. శనివారం రాత్రి హైడ్రామా నడిచింది. అనంతరం ఆదివారం సాయంత్రం పోలీసులు వీరికి కౌన్సెలింగ్ ఇప్పించిన విషయం తెలిసిందే.