తెలంగాణలో నో సెకెండ్ వేవ్?: పరిమితంగా కరోనా కేసులు: 11 వేలకు తగ్గిన పేషెంట్లు
హైదరాబాద్: ప్రాణాంతక కరోనా వైరస్ తీవ్రత తెలంగాణ క్రమంగా తగ్గుముఖం పడుతోంది. దేశ రాజధాని సహా ఉత్తరాదిన కొన్ని రాష్ట్రాల్లో సెకెండ్ వేవ్ పరిస్థితులు నెలకొనగా.. ఆ తరహా పరిస్థితులు తెలంగాణలో కనిపించట్లేదు. రోజువారీ పాజిటివ్ కేసులు భారీగా తగ్గుతున్నాయి. తెలంగాణలో కరోనా సెకెండ్ వేవ్ తీవ్రత దాదాపుగా లేనట్టే. కరోనా మరణాలు కూడా పరిమితంగా ఉంటున్నాయి. మరణాల సంఖ్య అయిదుకు మించకపోవడం ఊరటనిస్తోంది. ఏపీలోనూ రోజువారీ కేసులు మూడంకెలకు పరిమితంగానే నమోదవుతున్నాయి.
తెలంగాణలో 24 గంటల వ్యవధిలో కొత్తగా 921 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. నలుగురు మరణించారు. 1,097 మంది డిశ్చార్జి అయ్యారు. సంపూర్ణ ఆరోగ్యంతో కోలుకున్నారు. ఇప్పటిదాకా నమోదైన మొత్తం కేసుల సంఖ్య 2,65,049కి చేరుకుంది. ఇందులో డిశ్చార్జి అయిన వారి సంఖ్య 2,52,565గా నమోదైంది. మృతుల సంఖ్య 1,437కు చేరుకుంది. రాష్ట్రవ్యాప్తంగా యాక్టివ్గా ఉన్న కేసులు క్రమంగా తగ్గుతున్నాయి. తాజాగా 11,047గా నమోదు అయ్యాయి. గృహాలు, ఇన్స్టిట్యూషనల్ ఐసొలేషన్లో 8,720 మంది చికిత్స పొందుతున్నారు. ఈ మేరకు తెలంగాణ వైద్య మంత్రిత్వ శాఖ అధికారులు ఓ ప్రకటన విడుదల చేశారు.
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో కొత్తగా 146 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. ఇదివరకటి రోజువారీ కేసులతో పోల్చుకుంటే ఈ సంఖ్య చాలా తక్కువ. ఆదిలాబాద్-6, భద్రాద్రి కొత్తగూడెం-71, జగిత్యాల-50, జనగామ-8, జయశంకర్ భూపాలపల్లి-19, జోగుళాంబ గద్వాల-5, కామారెడ్డి-11, కరీంనగర్-44, ఖమ్మం-36, కొమరంభీమ్ ఆసిఫాబాద్-9, మహబూబ్నగర్-14, మహబూబాబాద్-15, మంచిర్యాల-18, మెదక్-9, మేడ్చల్ మల్కాజ్గిరి-81, ములుగు-16, నాగర్ కర్నూలు-9, నల్లగొండ-49, నారాయణపేట్-4, నిర్మల్-8, నిజామాబాద్-15, పెద్దపల్లి-29, రాజన్న సిరిసిల్ల-27, రంగారెడ్డి-61, సంగారెడ్డి-17, సిద్ధిపేట్-18, సూర్యాపేట్-31, వికారాబాాద్-7, వనపర్తి-11, వరంగల్ రూరల్-14, వరంగల్ అర్బన్-45, యాదాద్రి భువనగిరి-18 కేసులు నమోదు అయ్యాయి.
Recommended Video
తెలంగాణ వ్యాప్తంగా 24 గంటల్లో 42,740 కరోనా నిర్ధారణ పరీక్షలను నిర్వహించినట్లు అధికారులు తమ తాజా బులెటిన్లో వెల్లడించారు. దీనితో ఇప్పటిదాకా నిర్వహించిన మొత్తం టెస్టింగుల సంఖ్య 52,01,214గా నమోదైంది. సగటున ప్రతి 10 లక్షల మంది జనాభాకు 1,39,742 మంది శాంపిళ్లను పరీక్షించినట్లు పేర్కొన్నారు.