హైదరాబాద్ మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి
రెండు తెలుగు రాష్ట్రాల ఉమ్మడి రాజధాని హైదరాబాద్ రూపురేఖలు మార్చేస్తున్న 'మెట్రో రైలు' ఎండీ ఎన్వీఎస్ రెడ్డి. ఈ ప్రాజెక్టు ప్రారంభం నుంచి సంస్థ ఎండీగా పని చేస్తున్న ఎన్వీఎస్ రెడ్డి.. ప్రస్తుతం ప్రాజెక్టు ఒక కారిడార్ ప్రారంభంలో కీలకంగా వ్యవహరిస్తున్నారు. తెలంగాణ రాష్ట్రానికి ప్రత్యేకతలు తెలియజేస్తున్నారు. మెట్రో రైలును హైదరాబాద్ ప్రజలకు అందుబాటులోకి తెచ్చి కలను సాకారం చేసిన ఘనత ఆయనకే దక్కుతుంది.
Recommended Video
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పలువురు ముఖ్యమంత్రులు ఉన్న సమయంలో కూడా తన లక్ష్యం కోసం పనిచేస్తూ హైదరాబాద్ మెట్రో రైలు తొలి దశ ప్రాజెక్టును పూర్తి చేసి మైట్రో రైలును హైదరాబాద్ నగర ప్రజలకు అందుబాటులోకి తెచ్చారు.
మెట్రో రైలు ప్రాజెక్టుల రూపకల్పనలో పేరు మోసిన శ్రీధరన్ వద్ద ఆయన పనిచేశారు. హైదరాబాదు ఫ్లైఓవర్ల రూపకల్పనలో కూాాాడా ఆయన కీలక పాత్ర పోషించారు. మెట్రో రైలు ప్రజలకు అందుబాటులోకి తేవడంతో ఆయన పేరు ప్రముఖంగా వెలుగులోకి వచ్చింది. మెట్రో రైలు ప్రాజెక్టు పనులకు ఏర్పడిన అవాంతరాలను తొలగించడంలో ఆయన అత్యంత జాగ్రత్తగా వ్యవహరించారు.