టీడీపీ నేత మోత్కుపల్లి నర్సింహులు
తెలుగుదేశం పార్టీ ఏర్పాటైనప్పటి నుంచి 1983లో ఆలేరు నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందిన మోత్కుపల్లి నర్సింహులు.. 2004, 2014 ఎన్నికల్లో మాత్రమే ఓటమి పాలయ్యారు. అగ్రవర్ణ నేతలపై అనునిత్యం పోరాడుతూ ముందుకు సాగుతున్న మోత్కుపల్లి నర్సింహులు.. 2009 - 2014 మధ్య టీఆర్ఎస్ అధినేత కేసీఆర్పై విమర్శలతో వార్తల్లో నిలిచారు.
Recommended Video
తాజాగా వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ తో టీడీపీ పొత్తు ఉంటుందన్న సంగతి బయటపెట్టిందీ మోత్కుపల్లి. దీంతో రేవంత్ రెడ్డికి, మోత్కుపల్లికి మధ్య వాగ్వాదం జరిగింది. సీఎం కేసీఆర్ తర్వాత అదే స్థాయిలో స్పందించగలిగి, ప్రజల మద్దతు సంపాదించుకున్న రేవంత్ రెడ్డికి అడ్డు తగలడంతోపాటు వార్తల్లో నిలిచారు. ప్రస్తుతం ఆయన తెలంగాణ టీడీపీలో సీనియర్ నేతగా కొనసాగుతున్నారు. అప్పట్లో ఆయనకు గవర్నర్ పదవి ఇస్తారని వార్తలు వచ్చినప్పటికీ అలాంటిదేం జరగలేదు.
గవర్నర్ పదవిపై ఆశలు పెట్టుకున్నారు. అయితే అది ఆయనకు అందని ద్రాక్షగానే మారింది. తెలుగుదేశం పార్టీకి తెలంగాణ దళిత నేతగా అతి ముఖ్య నాయకుడిగా మారారు.