ఎత్తు కోసం ఆపరేషన్: 'నిఖిల్ రెడ్డి నరకయాతన, డాక్టర్లపై ఫిర్యాదు'
హైదరాబాద్: పొడవు కావాలని కాళ్లకు ఆపరేషన్ చేయించుకొని, ప్రస్తుతం మంచానికే పరిమితమైన సాఫ్టువేర్ ఇంజినీర్ నిఖిల్ రెడ్డి అంశాన్ని బీజేపీ నాయకులు, బాధితుడు తండ్రి హెచ్చార్సీ దృష్టికి తీసుకు వెళ్లారు. బుధవారం నాడు వారు ఫిర్యాదు చేశారు.
ఎత్తు కోసం నిఖిల్ రెడ్డికి ఆపరేషన్, ఎలాంటి మార్పు లేదు: ఎంసీఐకి ఫిర్యాదు
ఈ సందర్భంగా మాట్లాడుతూ.. నిఖిల్ నరకయాతన పడుతున్నాడని, అందుకు కారణమైన వైద్యుల పైన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. తన కొడుకు ఈ పరిస్థితికి రావడానికి గ్లోబల్ ఆసుపత్రి వైద్యులే కారణమని చెప్పారు.
కాళ్ల ఆపరేషన్పై కుమిలిపోతున్న నిఖిల్ రెడ్డి: ఇంటికి కిషన్ రెడ్డి (పిక్చర్స్)
ఇదిలా ఉండగా, నిఖిల్ ఎత్తు పెంపు సర్జరీపై తెలంగాణ మెడికల్ కౌన్సిల్ ఇటీవల స్పందించింది. సర్జరీ చేయడం సరికాదని, ఇది అనవసరమని, ఇందుకు బాధ్యులైన వైద్యులపై చర్యలు తీసుకుంటామని పేర్కొంది. నిఖిల్ రెడ్డి ప్రస్తుతం బెడ్కే పరిమితమైన విషయం తెలిసిందే.