బల్కంపేట ఎల్లమ్మను దర్శించుకున్న నీతా అంబానీ: హుండీలో వేసిందెంతంటే?
భారత కుబేరుడు, ప్రముఖ వ్యాపారవేత్త ముకేష్ అంబానీ సతీమణి నీతా అంబానీ నగరంలోని బల్కంపేట రేణుకా ఎల్లమ్మ అమ్మవారిని ఇటీవల దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆమె హుండీలో డబ్బులతో కూడిన ఓ కవర్ వేశారు.
హైదరాబాద్: భారత కుబేరుడు, ప్రముఖ వ్యాపారవేత్త ముకేష్ అంబానీ సతీమణి నీతా అంబానీ నగరంలోని బల్కంపేట రేణుకా ఎల్లమ్మ అమ్మవారిని ఇటీవల దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆమె హుండీలో డబ్బులతో కూడిన ఓ కవర్ వేశారు.
ఐపీఎల్ సందర్భంగా..
ఐపీఎల్ మ్యాచ్ సందర్భంగా హైదరాబాద్ వచ్చిన నీతా అంబానీ.. బల్కంపేట అమ్మవారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు.
భారీ మొత్తం
కాగా, గురువారం ఉదయం ఆలయంలో హుండీ లెక్కింపు చేపట్టారు. ఈ సందర్భంగా నీతా అంబానీ వేసిన కవర్ను తెరిచి చూడగా అందులో ఏకంగా రూ. లక్ష ఉన్నట్లు ఆలయ అధికారులు వెల్లడించారు.
మొక్కులు చెల్లించుకున్న నీతా
నీతా అంబానీ తమ జట్టు ముంబై ఇండియన్స్ ఐపీఎల్ టైటిల్ గెలిచిన నేపథ్యంలో మొక్కు చెల్లించుకున్నట్లు తెలుస్తోంది. కాగా, నీతా అంబానీ హైదరాబాద్ వచ్చినప్పుడల్లా బల్కంపేట అమ్మవారిని దర్శిస్తారు.
ముంబై గెలుపుతో..
హైదరాబాద్లోని ఉప్పల్ స్టేడియంలో జరిగిన ఐపీఎల్ ఫైనల్ మ్యాచులో పుణె జట్టును ఓడించిన ముంబై జట్టు టైటిల్ను గెలుచుకున్న విషయం తెలిసిందే.