సోషల్ మీడియాలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోస్టులపై కండక్టర్ వివరణ
తాను ముఖ్యమంత్రిని గానీ, ఆర్టీసీ అధికారులను గాని వ్యక్తిగతంగా విమర్శించలేదని ఆర్టీసీ బస్ కండక్టర్ సంజీవ్ స్పష్టం చేశారు. సోషల్ మీడియాలో ఆయన చేసిన పోస్టులపై వివాదం నెలకొంది.
నిజామాబాద్: తాను ముఖ్యమంత్రిని గానీ, ఆర్టీసీ అధికారులను గాని వ్యక్తిగతంగా విమర్శించలేదని ఆర్టీసీ బస్ కండక్టర్ సంజీవ్ స్పష్టం చేశారు. సోషల్ మీడియాలో ఆయన చేసిన పోస్టులపై వివాదం నెలకొంది.
కెసిఆర్పై పోస్ట్: కండక్టర్పై విచారణకు ఆర్టీసీ ఆదేశం
ప్రభుత్వాన్ని కించపరిచేలా సోషల్ మీడియాలో పోస్టింగులు పెట్టారని నిజామాబాద్ 1 ఆర్టీసీ డిపోలో పని చేస్తున్న సంజీవ్ పైన అధికారులు విచారణ చేపట్టారు.
ఈ నేపథ్యంలో ఆయన స్పందించారు. తాను సీఎంను గానీ, ఆర్టీసీ అధికారులను గానీ వ్యక్తిగతంగా విమర్శించలేదన్నారు.
ఆర్టీసీలో సమస్యలు, కార్మికులు ఎదుర్కొంటున్న పని భారాలపైనే సామాజిక మాధ్యమాలలో పోస్టులు చేశానని, ఆర్టీసీ అభివృద్ధి, ప్రజల సౌకర్యాల కోసమే ఆ పోస్టింగ్ పెట్టాను తప్ప ఎవరినీ విమర్శించలేదన్నారు.
కండక్టర్ సంజీవ్ పైన విజిలెన్స్ ఎంక్వయిరీ వేయాలని ఉత్తర్వులు అందాయని, సంజీవ్ కరీంనగర్లో విచారణకు హాజరయ్యాడని, ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని, ఉత్తర్వులు అందాక చర్యలు ఉంటాయని డిపో మేనేజర్ తెలిపారు.