పతంగుల బ్యాన్ అంటూ వదంతులు! పోలీస్ కమిషనర్ ఏం చెప్పారంటే?
హైదరాబాద్: భాగ్యనగరంలో సంక్రాంతి పర్వదినం సందర్భంగా గాలి పటాలు బ్యాన్ చేశారనే ప్రచారం జరిగిందని, అది తప్పుడు ప్రచారమని హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ అంజనీ కుమార్ పేర్కొన్నారు. అలాంటి పుకార్లు నమ్మవద్దని చెప్పారు. గుర్తు తెలియని వ్యక్తులు తప్పుడు ప్రచారం చేశారన్నారు.
సంక్రాంతి అంటేనే గాలిపటాల పండుగ అన్నారు. అలాంటప్పుడు దానిని ఎలా బ్యాన్ చేస్తామని అన్నారు. కానీ జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. మతసంబంధమైన ప్రాంతాల్లోకి వెళ్లకుండా జాగ్రత్తగా ఉండాలని చెప్పారు. అలాగే, రోడ్ల పైన పతంగులు ఎగురవేయవద్దని సూచించారు.
రోడ్ల పైన పడిన పతంగులు తీసుకునే సమయంలో జాగ్రత్తగా ఉండాలన్నారు. బిల్డింగుల పైన కూడా పతంగులు ఎగురవేసే సమయంలో జాగ్రత్తగా ఉండాలన్నారు. రెయిలింగ్ ఉండేలా చూసుకోవాలన్నారు. రోడ్ల పైన వచ్చే వాహనాలను చూసుకోవాలన్నారు.
Comments
English summary
There is some rumors spread by unauthorised persons regarding banning of kite flying on the festival of Sankranthi. But CP said that there is no ban on kite flying on festival of Sankranthi. He said Sankranthi is festival of kites and flying kites festival of Sankranthi.
Story first published: Monday, January 14, 2019, 21:16 [IST]