మతిలేని హింస: తెలుగువారిపై దాడిపై సత్య నాదెళ్ల
మన సమాజంలో ఇలాంటి మతిలేని హింసకు, మతవిద్వేషానికి తావులేదని మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల అన్నారు.
వాషింగ్టన్: మన సమాజంలో ఇలాంటి మతిలేని హింసకు, మతవిద్వేషానికి తావులేదని మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల అన్నారు. కాన్సాస్లో తెలుగు ఇంజినీర్లు శ్రీనివాస్ కూచిభొట్ల, అలోక్ మాదాసిలపై జరిగిన కాల్పుల ఘటనపై ఆయన దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
తెలుగువారిపై దాడి: కేటీఆర్ దిగ్భ్రాంతి, యూఎస్ ఇండియన్ ఎంపీల తీవ్ర స్పందన
ఆ హత్యకు ట్రంప్కు సంబంధం లేదు: వైట్హౌజ్ సమాధానం ఇది
There’s no place for senseless violence & bigotry in our society. My heart is with the victims & families of the horrific shooting in Kansas
— Satya Nadella (@satyanadella) February 25, 2017
ఈ ఘటనలో మృతి చెందిన శ్రీనివాస్ కుటుంబసభ్యులకు ఆయన ప్రగాఢ సానుభూతి తెలిపారు. వారికి అండగా ఉంటానని ట్విటర్లో పేర్కొన్నారు. తెలుగువారిపై కాల్పులు జరిపిన ఘటనలో ఇండియన్ అమెరికన్ ఎంపీలు కూడా తీవ్రంగా స్పందించారు. దాడి ఘటనను ఖండించారు.
నా ప్రశ్నలకు బదులేది?: కన్నీటి పర్యాంతమైన శ్రీనివాస్ భార్య సునయన(వీడియో)
కాగా, వరుస దాడుల నేపథ్యంలో అమెరికాలోని ప్రవాసుల్లో ఆందోళన నెలకొంది. ఎప్పుడేం జరుగుతుందో అనే భయానికి గురవుతున్నారు. ప్రవాసులపై దాడులు జరుతుండటంతో మన దేశంలోన కుటుంబసభ్యులు కూడా ఆందోళన చెందాల్సిన పరిస్థితి ఏర్పడింది.