హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

అమ్మాయిలను ఎరగా వేసి దోపిడిలు, ఎదురుతిరిగితే ఇక అంతే

అమ్మాయిలను ఎరగా వేసి దోపిడిలకు పాల్పడే ముగ్గురు సభ్యుల ముఠాను హైద్రాబాద్ లోని నార్త్ జోన్ పోలీసులు గురువారం నాడు అరెస్టు చేశారు.

By Narsimha
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్:అమ్మాయిలను ఎరగా వేసి దోపిడిలకు పాల్పడే ముగ్గురు సభ్యుల ముఠాను హైద్రాబాద్ లోని నార్త్ జోన్ పోలీసులు గురువారం నాడు అరెస్టు చేశారు.

బోయిన్ పల్లి బాపూజీనగర్ కు చెందిన సంతోష్ యాదవ్, క్లాక్ టవర్ ప్రాంతానికి చెందిన నాగరాజు, కాచిగూడకు చెందిన రంగయ్య ముఠాగా ఏర్పడ్డారు.

అర్ధరాత్రి వేళల్లో తమ గ్యాంగ్ లో ఉన్న అమ్మాయిలనే రైల్వేస్టేషన్ పరిసరాల్లో పుట్ పాత్ లపై నిలబెట్టి యువకులను ఆకర్షించేలా ప్లాన్ చేస్తారు.

North zone police arrested three members team for cheating

తమ వలలో పడినవారిని తన భార్యతో అసభ్యంగా ప్రవర్తించావంటూ దాడికి పాల్పడి వారి వద్ద ఉన్న డబ్బులు, వస్తువులను లాక్కోని పారిపోయేవారు.

దాడి సమయంలో ఎవరైన ఎదురుతిరిగితే నిందితులు తమంతట తామే బ్లేడ్ తో కోసుకొని భయబ్రాంతులకు గురిచేస్తారని పోలీసులు చెప్పారు. గోపాలపురం పోలీస్ స్టేషన్ పరిధిలో మూడు మాసాల్లో మూడు కేసులు నమోదయ్యాయని నార్త్ జోన్ డిసిపి సుమతి చెప్పారు.

ఈ కేసులపై ూప్రత్యేక నిఘా పెట్టిన పోలీసులు సీసీ కెమెరాల ఆధారంగా నిందితులను అరెస్టు చేశారు. నిందితులపై పీడియాక్ట్ పెట్టనున్నట్టు పోలీసులు చెప్పారు.

English summary
North zone police arrested three members team for cheating on Thursday.Rangaiah , Nagaraju and Santosh Yadav formed a group, they attract people with ladies. victims complaint against them.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X