హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

విషపూరిత నురగ, బస్సుకు తప్పిన ప్రమాదం: కొరియా లేక్‌ను పరిశీలించిన కేటీఆర్

నల్గొండ - రంగారెడ్డి జిల్లా సరిహద్దుల్లోని అనంతారం వద్ద మూసీ వంతెన పైన ఆర్టీసి బస్సుకు మూడు రోజుల క్రితం తృటిలో ప్రమాదం తప్పింది. మూసీ నది నీటిలో వచ్చిన నురగ వంతెనను కమ్మేసింది.

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: నల్గొండ - రంగారెడ్డి జిల్లా సరిహద్దుల్లోని అనంతారం వద్ద మూసీ వంతెన పైన ఆర్టీసి బస్సుకు మూడు రోజుల క్రితం తృటిలో ప్రమాదం తప్పింది. మూసీ నది నీటిలో వచ్చిన నురగ వంతెనను కమ్మేసింది.

డ్రైవరుకు రోడ్డు కనిపించలేదు. దీంతో బస్సు వంతెన కిందకు దిగిపోయింది. డ్రైవర్ అప్రమత్తం కావడంతో బస్సుకు ప్రమాదం తప్పింది. ప్రమాదాన్ని గుర్తించిన డ్రైవర్ బస్సును నిలిపివేశాడు. ఆ బస్సు చెంగిచెర్ల డిపోకు చెందినది.

బుధవారం ఉధయం యాదాద్రి జిల్లాలోని బూధాన్ పోచంపల్లి నుంచి బస్సు సికింద్రాబాద్ వెళ్తోంది. బస్సు పోచంపల్లి మండలం పిలాయిపల్లి గ్రామ శివారులోని అనంతారం మూసి వంతెన వద్దకు చేరుకోగానే రసాయనాలతో కలిసిన నురగ రోడ్డు పైకి వచ్చింది.

Not just Bengaluru lakes: toxic froth from Hyderabad's Musi river almost engulf a bus

బస్సు వంతెన మధ్యలోకి వెళ్లగానే డ్రైవరుకు ఏమీ కనిపించలేదు. ఎడమ పక్కకు తిప్పడంతో ముందు టైరు వంతెన కిందకు దిగింది. అప్రమత్తమైన డ్రైవర్ బస్సు నిలిపేశాడు. ప్రయాణీకులను దింపేశారు. బస్సులో అప్పుడు 24 మంది ప్రయాణీకులు ఉన్నారు. ఎవరికీ ఏం కాలేదు.

హైదరాబాదులో 1960ల నుంచి ఫార్మా బూమ్ పుంజుకుంది. 1990ల నాటికి ఫార్మా రంగం మరింత చాలా విస్తరించింది.

సెల్ఫీ మోజులో ఇద్దరు ఇలా చేశారు...చివరకు ప్రాణాలు కోల్పోయారుసెల్ఫీ మోజులో ఇద్దరు ఇలా చేశారు...చివరకు ప్రాణాలు కోల్పోయారు

1999లో ప్రభుత్వం జినోమ్ వ్యాలీ ప్రాజెక్టుకు అప్రూవ్ చేసింది. దీంతో హైదరాబాద్ చుట్టుపక్కల దాదాపు వందకు పైగా బయోటెక్ కంపెనీలు పుట్టుకు వచ్చాయి. పలు కంపెనీలు నిబంధనలను ఉల్లంఘించి విషపూరిత నీటిని మూసి నదిలోకి, హుస్సేన్ సాగర్‌లోకి విడుదల చేస్తున్నాయనే విమర్శలు ఉన్నాయి.

తెరాస ప్రభుత్వం వచ్చాక కలుషిత నీటిని సాగర్‌లోకి రాకుండా ప్రణాళికలు చేసింది. వారం రోజుల క్రితమే మంత్రి కల్వకుంట్ల తారక రామారావు దక్షిణ కొరియాలో పర్యటించారు.

మూసి నదిలో విషపూరిత రసాయ నీరు నేపథ్యంలో.. ఆయన అక్కడి చియోంగ్రిచియోన్ నది ప్రక్షాళన తీరును పరిశీలించారు. ప్రక్షాళన కోసం తీసుకున్న కార్యక్రమాలను,పనులను అడిగి తెలుసుకున్నారు.

English summary
On the morning of January 25, a Telangana RTC bus skid as it was making its way through Pochampalli mandal in the state's Yadadri District.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X