ర్యాష్ డ్రైవింగ్:నిర్మాత పరుచూరి ప్రసాద్ తనయుడు కిరిటీ అరెస్టు
మితిమీరిన వేగంతో వాహనం నడుపుతూ పాదచారులను ,భయభ్రాంతులకు గురిచేసిన సిని నిర్మాత పరుచూరి ప్రసాద్ తనయుడు కిరిటీపై పోలీసులు కేసు నమోదు చేశారు. అంతేకాదు ఆయనను అరెస్టు చేశారు.
హైదరాబాద్:మితిమీరిన వేగంతో వాహనం నడుపుతూ ఇతర వాహనదారులను భయబ్రాంతులకు గురి చేసిన సినీ నిర్మాత పరుచూరి ప్రసాద్ తనయయుడు కిరిటీ పై జూబ్లిహిల్స్ పోలీస్ స్టేషన్ లో క్రిమినల్ కేసు నమోదైంది.
ఫిలింనగర్ రోడ్డు నంబర్ -10లో నివసించే పరుచనచి కిరిటీ బిటెక్ చదివాడు. హీరో బాలకృష్ణ నటించిన సింహ సినిమాకు పరుచూరి ప్రసాద్ నిర్మాతగా వ్యవహరించాడు.
కొద్దిరోజుల నుండి తన ఫార్చ్ నర్ కారు ( కారు ఎపి 09 సివీ 2929) లో బంజారాహిల్స్, జూబ్లిహిల్స్ రోడ్లపై దూసుకెళ్తూ ఇతరులకు ఇబ్బంది కల్గిస్తున్నాడు. ఈ మేరకు పోలీసులకు ఫిర్యాదు అందింది.
ఈ విషయమై పోలీసులు నిఘా పెట్టారు. సిసీ పుటేజీల ఆధారండా కిరిటీ ర్యాష్ డ్రైవింగ్ ను గుర్తించారు. శుక్రవారం తెల్లవారుజామున జుబ్లిహిల్స్ చౌరస్తాలో పోలీసులు నిఘావేసి మితిమీరిన వేగంతో దూసుకువస్తున్న వాహానాన్ని ఆపారు. ఈ వాహనాన్ని కిరిటీ నడుపుతున్నాడు.కిరిటీని అరెస్టు చేశారు. ఈ మేరకు జూబ్లిహిల్స్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.