వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

2021లో టాలీవుడ్‌కు తొలి విషాదం -సినీ రచయిత వెన్నెలకంటి ఇకలేరు

|
Google Oneindia TeluguNews

కొత్త ఏడాదిలోనూ సినీ రంగాన్ని విషాదం వెంటాడుతోంది. ప్రముఖ సినీ రచయిత వెన్నెలకంటి(63) మంగళవారం సాయంత్రం కన్నుమూశారు. తీవ్రమైన గుండెపోటు రావడంతో చెన్నైలో తుదిశ్వాస విడిచారు. వెన్నెలకంటి మృతిపట్ల దేశప్రముఖులు, సినీ, రాజకీయ వర్గాలు తీవ్ర సంతాపం తెలిపాయి.

తండ్రి అక్రమ సంబంధంతో కూతుళ్ల విరక్తి -భర్తను రూ.1.5కోట్లకు అమ్మేసిన భార్య -ప్రేయసికి షాక్తండ్రి అక్రమ సంబంధంతో కూతుళ్ల విరక్తి -భర్తను రూ.1.5కోట్లకు అమ్మేసిన భార్య -ప్రేయసికి షాక్

మరోవైపు వెన్నెలకంటి మృతి పట్ల ఉపరాష్ట్రపతి సంతాపం తెలియజేశారు. వెన్నెలకంటి మంచి గీత రచయితే గాక, గొప్ప సాహితీవేత్త అని కొనియాడారు. వారు రాసిన గీతాల్లో శ్రీ రంగరంగనాథుని దివ్య రూపమే చూడవే అనే గీతం తనకెంతో ఇష్టమైనదని తెలిపారు. ఆయన కుమారుడు తండ్రి వారసత్వాన్ని అందిపుచ్చుకున్నారని తెలియజేసి వెన్నెలకంటి తన దగ్గర ఆనందం వ్యక్తం చేశారని, ఇంతలోనే ఇలా జరగడం విచారకరమని తెలిపారు.

 Noted Telugu Lyricist, Dialogue Writer Vennelakanti Passes Away

ఆయనకు ఇద్దరు తనయులు. ఒకరు శశాంక్ వెన్నెలకంటి. అతను కూడా సినీ రచయిత. రెండవ తనయుడు రాకెందు మౌళి. కాగా డబ్బింగ్ స్క్రిప్ట్ రైటర్‌గా వెన్నెలకంటికి మంచి పేరు ఉంది. తమిళ సినిమాలకు కూడా లిరిక్స్ అందించారు.

1957 నవంబర్ 30న నెల్లూరులో జన్మించారు. వెన్నెలకంటి పూర్తి పేరు వెన్నెలకంటి రాజేశ్వర ప్రసాద్. హరి కథలు, ఆధ్యాత్మిక ప్రసంగాలు వినడాన్ని ఆయన బాగా ఇష్ట పడేవారు. 11 ఏళ్లకే కవితలు, పద్యాలూ రాశారు. 1986లో భాస్కర్ రావు డైరెక్షన్‌లో వచ్చిన శ్రీరామ చంద్రుడు సినిమాతో గీత రచయితగా వెన్నెలకంటి ప్రస్థానం మొదలైంది. వెన్నెలకంటి తండ్రి 'ప్రతిభా' కోటేశ్వరరావుకూ సినీ అనుబంధం ఉంది. ఎస్పీబీ ప్రోత్సాహంతో సినీ రంగంలోకి అడుగు పెట్టారు.

జంద్యాల రాసిన ఏక్ దిన్కా సుల్తాన్, ఈ చరిత్ర ఏ సిరాతో, ఎవ్వనిచే జనించు, దర్పణం వంటి నాటకాలలో వెన్నెలకంటి నటించారు. హాలీవుడ్ చిత్రాల తెలుగు డబ్బింగ్ వెన్నెలకంటితోనే ఆరంభం అయ్యాయి. 34 ఏళ్లలో 1500కు పైగా స్ట్రెయిట్‌ పాటలు రాసిన వెన్నెలకంటి.. డబ్బింగ్ చిత్రాల్లో మరో 1500కు పైగా పాటలు రచించారు. బ్యాంకు ఉద్యోగిగాను ఆయన పని చేశారు.

English summary
Veteran Telugu lyricist, dialogue writer Vennelakanti Rajeswara Prasad passed away in Chennai on Tuesday. He was 64. Vennelakanti died due to cardiac arrest, reported Telangna Today. In an illustrious career spanning over three decades, Vennelakanti penned the lyrics for nearly 2000 songs and wrote dialogues for 300 films. Born at Nellore in 1957, he had begun writing poetry at a very young age and was inclined towards spiritual speeches and Harikathas.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X