వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నోట్లు మారుస్తున్న మావోలు: 12లక్షలు సీజ్, ఇద్దరి అరెస్ట్

మావోయిస్టులు ఇచ్చిన డబ్బులను మార్చేందుకు ప్రయత్నించిన ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు.

|
Google Oneindia TeluguNews

భద్రాచలం: మావోయిస్టులు ఇచ్చిన డబ్బులను మార్చేందుకు ప్రయత్నించిన ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి రూ.12 ల‌క్ష‌ల విలువైన ర‌ద్ద‌యిన రూ.500, రూ.1000 నోట్ల‌ను స్వాధీనం చేసుకున్నారు.

పోలీసులు తెలిపిన వివ‌రాల ప్ర‌కారం.. భ‌ద్రాద్రి జిల్లాలోని చ‌ర్ల మండ‌లం అట‌వీ ప్రాంతంలో గ‌జా ఇంజినీరింగ్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో త్రినాథ‌రావు డిప్యూటీ ప్రాజెక్టు మేనేజ‌రుగా, సిద్ధార్థ్ అసిస్టెంట్ ఇంజినీర్‌గా ప‌నిచేస్తున్నారు.

Notes exchange: Two persons arrested in Bhadrachalam

కాగా, గుర్తుతెలియ‌ని వ్య‌క్తులు కొంద‌రు వారి వ‌ద్ద‌కు వ‌చ్చి త‌మ‌నుతాము మావోయిస్టులుగా ప‌రిచ‌యం చేసుకున్నారు. త‌మ వ‌ద్ద ఉన్న పెద్ద‌నోట్ల‌ను మార్చి ఇవ్వాల‌ని వారిని కోరుతూ రూ.12 ల‌క్ష‌లు అప్ప‌గించారు. ఈ క్రమంలో అసిస్టెంట్ ఇంజినీర్ సిద్ధార్థ్‌కు మంథ‌న్‌గోడ్ బ్రాంచ్ పోస్టు మాస్ట‌ర్ స‌త్య‌నారాయ‌ణాచారితో ప‌రిచ‌యం ఉండ‌టంతో అత‌డిని క‌లిసి.. 15 శాతం క‌మిష‌న్‌పై నోట్ల‌ను మార్చేందుకు ఒప్పందం చేసుకున్నారు.

ఈ నేపథ్యంలో బుధ‌వారం రాత్రి త్రినాథ్‌రావు, సిద్ధార్థ్‌లు డ‌బ్బులు ప‌ట్టుకుని మంథ‌న్‌గోడ్ చేరుకున్నారు. విష‌యం కాస్తా పోలీసుల‌కు చేర‌డంతో వీరిద్ద‌రిని అదుపులోకి తీసుకున్నారు. కేసు న‌మోదు చేసుకుని ద‌ర్యాప్తు చేస్తున్నారు.

English summary
Two persons arrested in Bhadrachalam due to exchange of currency notes, which is belongs to Maoists.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X