మిషన్ కాకతీయ: ఎన్నారై విరాళం 10 లక్షలు(ఫోటో)
హైదరాబాద్: మిషన్ కాకతీయకు అండగా నిలవాలని తెలంగాణ ప్రభుత్వం విజ్ఞప్తికి ఎన్నారైలు స్పందిస్తున్నారు. ఇందులో భాగంగా వరంగల్ జిల్లాలోని నల్లబెల్లి మండలం మేడిపల్లిలోని దామరచర్ల చెరువు పునరుద్ధరణకు ఎన్నారై వి. గీతా సుధాకర్ రావు రూ. 10 లక్షల విరాళాన్ని నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావుకు గురువారం అందజేశారు.
మిషన్ కాకతీయకు క్రెడాయ్ రూ. 50 లక్షల విరాళం
తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 'మిషన్ కాకతీయ' పథకానికి భారతదేశ్ స్ధిరాస్తి వ్యాపారుల సంఘం (క్రెడాయ్) గతంలో ముఖ్యమంత్రి కేసీఆర్ను కలిసి రూ.50 లక్షలు విరాళాన్ని ప్రకటించారు.
అందులో భాగంగా బుధవారం నాడు మంత్రి హరీష్ రావును కలిసి తొలివిడతగా రూ.25 లక్షల చెక్కును క్రెడాయ్ ప్రతినిధులు విరాళంగా అందజేశారు. త్వరలోనే మరో రూ.25 లక్షలను ప్రభుత్వానికి అందజేయనున్నట్లు వారు వెల్లడించారు.
Comments
English summary
NRI V.Geetha Sudhakar Rao donated ten lakhs rupees cheque to minister for irrigation Sri T.Harish rao garu for restoration of dhamarla cheruvu at medipalli villege, nallavelli mandal, Warangal district.