ఓడీఎఫ్ ప్లస్ ర్యాంకులో తెలంగాణ టాప్.. ఆ తర్వాతే మిగతా రాష్ట్రాలు
బహిరంగ మల విసర్జన రహిత (ఓడీఎఫ్ ప్లస్)లో తెలంగాణ రాష్ట్రం టాప్లో నిలిచింది. దేశంలో తెలంగాణ రాష్ట్రమే ప్రథమ స్థానంలో నిలిచింది. ఆ తర్వాత మిగతా రాష్ట్రాలు నిలిచాయి. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం జాబితా రిలీజ్ చేసింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 8 ఏళ్లు అవుతున్న సందర్భంలో.. అన్నీ రంగాల్లో అభివృద్ది చెందుతూ వస్తోంది. పారిశ్రామిక సంస్థలకు వసతులు కల్పిస్తూ.. ఆహ్వానం అందిస్తోన్న సంగతి తెలిసిందే.
తలసరి ఆదాయం, పన్నుల రాబడి, జీడీపీ తదితర అంశాల్లో దేశంలో అగ్రగామి రాష్ట్రంగా ప్రత్యేక గుర్తింపు తెలంగాణ రాష్ట్రం సంపాదించుకుంది. ఇప్పుడు మరో కీలకమైన అంశంలో టాప్లో నిలిచింది. ఓడీఎఫ్ ప్లస్లో దేశంలో అన్ని రాష్ట్రాల కంటే ఉత్తమ ఫలితాలు సాధించింది. శుక్రవారం కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన ఓడీఎఫ్ ర్యాంకుల్లో 99.98 శాతంతో అగ్రస్థానంలో నిలిచింది.
రాష్ట్రంలో మొత్తం 12,769 గ్రామాలు ఉన్నాయి. వాటిలో 12,766 గ్రామాలు ఓడిఎఫ్ గ్రామాలుగా గుర్తించారు. ఓడీఎఫ్ లేని గ్రామాలుగా తెలంగాణలో కేవలం మూడు గ్రామాలు మాత్రమే మిగిలాయి. ఓడీఎఫ్ సాధనలో తెలంగాణ రాష్ట్రం 99.98 శాతం ఫలితాలను రాబట్టింది. దీంతో అగ్రస్థానంలో నిలిచింది. ఓడీఎఫ్ ప్లస్తో జ్వరాల బారి నుంచి విముక్తి కలుగనుంది.