ఒక జవాబు పత్రం, రెండు సంస్థల వెరిఫికేషన్ ఇంటర్ బోర్డు అతి జాగ్రత్త
ఇంటర్ ఫెలయిన విద్యార్థుల ఫలితాలపై బోర్డు మరింత జాగ్రత్తగా వ్యవహరిస్తోంది. ఫెలయిన విద్యార్దుల జవాబు పత్రాల వెరిఫికేషన్ తోపాటు ఫలితాల ప్రాసెసింగ్ ను రెండు సంస్థలతో చేయిస్తోంది. అంటే ఒకే జవాబు పత్రాన్ని అటు గ్లోబరీనా తో పాటు మరోక సంస్థతో కూడ రీ వెరిఫికేషన్ చేయించాలని నిర్ణయించింది.
ఇంటర్ రిజల్ట్ వ్యవహరంలో పూర్తిగా సాంకేతిక పరమైన కారణాలు ఉన్నాయి. ముఖ్యంగా గ్లోబరీనా నిర్లక్ష్యం వల్లే ఎక్కువమంది విద్యార్థులకు తక్కువ మార్కులు రావడంతోపాటు పలువురు సబ్జెక్టుల్లో ఫెయిల్ అయ్యారు. ఇందుకు పూర్తి బాధ్యత గ్లోబరీనా సంస్థది. అయితే ప్రస్థుతం ఫెలయిన సుమారు మూడున్నర లక్షల మంది విద్యార్ధులకు చెందిన జవాబు పత్రాలు రీవెరిఫికేషన్, రీవాల్యుయెషన్ ప్రక్రియ కొనసాగుతోంది. అయితే రీవెరీఫికేషన్ నేపథ్యంలో మళ్లి అనుభవం లేని గ్లోబరీనా సంస్థ కు ఇవ్వడం తిరిగి ఇబ్బందులకు తావిస్తుందని భావించిన త్రిసభ్య కమిటి పలు సూచనలు చేసింది.
ఇందులో భాగంగానే మరో సంస్థతో సమాంతరంగా రీ వెరిఫికేషన్ చేయించాలని సూచించింది. ఈనేపథ్యంలోనే రీవెరీఫికేషన్ ప్రక్రియను అటు గ్లోబరీనాతో పాటు మరో సంస్థ చేత ఒక్కో విద్యార్థి జవాబు పత్రాలను రీవెరిఫికేషన్ చేయించాలని నిర్ణయించారు. కాగా మరో సంస్థ ఎంపికను స్టేట్ టెక్నాలజీ సర్వీసెస్ కు అప్పగించారు.