తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్ కేటీఆర్ - సక్సెస్ అయినట్లేనా: లెక్కలు ఏం చెబుతున్నాయి..!!
కేటీఆర్. తెలంగాణ మంత్రి. రాజకీయంగా కాబోయే సీఎం అంటూ అధికార పార్టీ నేతలు ప్రచారం చేస్తున్నారు. కానీ తెలంగాణకు కేటీఆర్ బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తున్నారు. రాష్ట్ర విభజన తరువాత సీఎం కేసీఆర్ చాలా వ్యూహాత్మకంగా కేటీఆర్ కు కేబినెట్ లో కీలక శాఖలు అప్పగించారు. అందులో రాష్గ్ర ప్రతిష్ఠతో పాటుగా కీలకమైన హైదరాబాద్ ఇమేజ్ ను పెంచే బాధ్యతలను అప్పగించారు.రాష్ట్ర విభజన ముందు హైదరాబాద్.. ఇప్పుడు హైదరాబాద్ అంటే ఖచ్చితంగా అక్కడ కేటీఆర్ ముద్ర కనిపిస్తోంది. ఇక..ఐటీ విస్తరణ..పెట్టుబడుల ఆకర్షణలో కేటీఆర్ సక్సెస్ అంకెలే స్పష్టం చేస్తున్నాయి. ఎనిమిదేళ్ల కాలంలో తెలంగాణకు వచ్చిన పెట్టుబడులు 47 బిలియన్ డార్లు. 21 లక్షల మందికి ప్రత్యక్ష ఉపాధి.
ఐటీ సీటీలో కేటీఆర్..సిరిసిల్లలో రామన్న
రాజకీయాల్లో
చిన్న
స్థాయిలో
ఉన్నవారైనా
నేను
అంటూ
తన
గురించి
తానే
ప్రచారం
చేసుకోవటం
సాధారణం.
కానీ,
కేటీఆర్
ప్రసంగాల్లో
మాత్రం
ఎక్కడా
నేను
అనే
పదం
వినిపించదు.
తెలంగాణ
ప్రభుత్వం..
కేసీఆర్
ప్రభుత్వం
అని
మాత్రమే
చెబుతూ
ఉంటారు.
ఇక,
రాజకీయంగా
కేటీఆర్
స్టైల్
డిఫరెంట్
గా
ఉంటుంది.
ఐటీ
మంత్రిగా
ఆ
శాఖకు
సంబంధించిన
సమీక్షలు..
ఒప్పందాలు..సెమినార్లతో
కేటీఆర్
గా
ఉన్నత
విద్యా
వంతుడిగా..
బాధ్యత
కలిగిన
మంత్రిగా
మెప్పించే
ప్రయత్నం
చేస్తారు.
పార్టీ
నేతగా
ప్రజల్లోకి
వెళ్తే
మాత్రం
రామన్న
లాగా
పక్కా
పొలిటీషియన్
గా
మారిపోతారు.
2018
నుంచి
కేటీఆర్
దావోస్
ప్రపంచ
ఆర్దిక
సదస్సులకు
హాజరవుతున్నారు.
అదే
విధంగా
తెలంగాణకు
పెట్టుబడులను
ఆకర్షించేందుకు
పలు
దేశాలు..నగరాల్లో
పర్యటనలు
చేసారు.
ప్రచారం
తక్కువగానే
ఉన్నా...సాధించింది
మాత్రం
చెప్పుకొనే
స్థాయి
లోనే
ఉంది.
రాష్ట్ర
విభజన
తరువాత
హైదరాబాద్
కు
వచ్చిన
పెట్టుబడులు..నగరంలో
చోటు
చేసుకున్న
మార్పులు
ఇప్పుడు
అందరినీ
ఆకర్షిస్తున్నాయి.
ఎనిమిదేళ్ల కాలంలో 47 బిలియన్ డాలర్ల పెట్టుబడులు
హైదరాబాద్ పెట్టుబడుల డెస్టినేషన్ గా..
గత
ఎనిమిదేళ్ల
కాలంలో
హైదరాబాద్
లో
మౌళిక
వసతుల
కల్పనకు
ప్రభుత్వ
ప్రాధాన్యత
పెరిగింది.
హైదరాబాద్
గురించి
మంత్రి
కేటీఆర్
విశ్లేషణలు
ఆసక్తి
కరంగా
ఉంటాయి.
హైదరాబాద్
లో
హైదరాబాద్
గురించి
చెప్పేటప్పుడు
"హైదరాబాద్
దక్షిణ,
ఉత్తర
భారతదేశాల
సమ్మేళనం.
ఇక్కడ
దోశతోపాటు
రోటీ
దొరుకుతుంది.
బయాలజీతో
టెక్నాలజీ
స్నేహం
చేస్తుంది.
లైఫ్
సైన్సెస్తో
డాటా
సైన్స్ను
కలుపుతుంది.
మ్యాంగో
వర్స్
నుంచి
మెటా
వర్స్
వరకు
అన్నింటికీ
కేంద్ర
స్థానం"
గా
ప్రమోట్
చేస్తున్నారు.
టెక్
దిగ్గజం
మైక్రోసాఫ్ట్
16వేల
కోట్ల
పెట్టుబడితో
హైదరాబాద్లో
మరో
మూడు
డేటా
కేంద్రాలు
ఏర్పాటు
చేస్తోంది.
అలాగే
భారతీ
ఎయిర్టెల్
గ్రూప్
దాదాపు
2వేల
కోట్ల
పెట్టుబడితో
హైదరాబాద్లో
భారీ
హైపర్స్కేల్
డేటా
సెంటర్ను
నిర్మించనుంది.
ఫార్మా
రంగానికి
చెందిన
యూరోఫిన్స్
సంస్థ
జీనోమ్
వ్యాలీలో
వెయ్యికోట్ల
రూపాయలతో
అత్యాధునిక
లేబొరేటరీ
క్యాంపస్ను
ఏర్పాటు
చేస్తోంది.
వీటితోపాటు
ప్రఖ్యాతి
గాంచిన
పెప్సికో,
పీఅండ్
జీ,
అల్లాక్స్,
అపోలో
టైర్స్
లిమిటెడ్,
వెబ్
పీటీ,
ఇన్స్పైర్
బ్రాండ్స్
వంటి
ఇతర
అంతర్జాతీయ
సంస్థలు
కూడా
2వేల
కోట్ల
రూపాయలు
పెట్టుబడులు
ప్రకటించినట్లు
మంత్రి
కేటీఆర్
చెప్పారు.