స్వాగతం.. సుస్వాగతం.. కొత్త ఎమ్మెల్యేల కోసం అసెంబ్లీ ముస్తాబు
హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీ భవనం నయా లుక్ సంతరించుకుంటోంది. కొత్త ఎమ్మెల్యేలకు స్వాగతం పలికేందుకు ముస్తాబవుతోంది. సరికొత్త హంగులతో సొబగులు అద్దుకుంటోంది. తెలంగాణలో ఎన్నికలు జరిగి ఫలితాలు వస్తున్న వేళ అసెంబ్లీకి మరమ్మత్తులు యుద్ధప్రతిపాదికన చేపట్టారు అధికారులు. అసెంబ్లీ ప్రాంగణంలోని భవనాలకు తెలుపు రంగు పెయింట్ వేయిస్తున్నారు.
రాజస్థాన్ శిల్పులు నిర్మించిన అసెంబ్లీ భవనం 1913 సంవత్సరంలో పూర్తయింది. మొదట్లో టౌన్ హాల్ గా సేవలు అందించింది ఈ భవనం. కొన్నేళ్ల పాటు ఉస్మానియా వర్సిటీ స్నాతకోత్సవాలు ఇక్కడే జరగడం విశేషం.
ఉమ్మడి రాష్ట్రంలో శాసన సభ సమావేశాలకు వేదికలా నిలిచిన ఈ భవనం ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ గా కొనసాగుతోంది. 2014 లో ప్రత్యేక రాష్ట్రంగా ఆవిర్భవించిన తెలంగాణకు రెండోసారి ఎన్నికలు జరిగి కొత్త ప్రభుత్వం ఏర్పడుతున్న తరుణంలో అందంగా ముస్తాబవుతోంది అసెంబ్లీ భవనం.