వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నేడు గాంధీభవన్‌లో ఉత్తమ్ ఒకరోజు దీక్ష, రైతులకు నష్టపరిహారం కోసం పట్టు...

|
Google Oneindia TeluguNews

రైతు సమస్యలపై ఒక్కరోజు దీక్ష చేస్తానని పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. రైతుల నుంచి పంట సేకరణ, వ్యవసాయ ఉత్పత్తుల కొనుగోళ్లలో ప్రభుత్వం వైఫల్యం చెందిందని తెలిపారు. అన్నదాత సమస్యల పరిష్కారం కోసం మంగళవారం ఒక్కరోజు గాంధీభవన్‌లో దీక్ష చేస్తానని ప్రకటించారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు దీక్ష కొనసాగుతోందని.. తమ పార్టీ నేతలు కూడా దీక్ష చేస్తారని చెప్పారు.

 pcc chief uttam one day agitation at gandhibhavan..

రైతుల ధాన్యం కొనుగోళ్లలో రకరకాల సమస్యలు ఉన్నాయని చెప్పారు. బస్తాల కొరత చూపించి విక్రయాలు నిలిపివేశారని ఉత్తమ్ ఆరోపించారు. తాలు పేరుతో నిలువుదోపిడి చేస్తున్నారని ఫైర్యారు. బస్తాకు 6 నుంచి 8 కిలోలు కోత కోస్తున్నారని మండిపడ్డారు. రైస్ మిల్లర్ల ఆగడాలు మితీమిరాయని... ఆరోపించారు.

రైతుల నుంచి కొనుగోలు చేసిన పంటకు వెంటనే డబ్బులు ఇవ్వాలని కోరారు. నష్టపోయిన పంటకు పరిహారం ఇవ్వాలని కోరారు. రైతులకు నష్టపరిహారం ఇవ్వాలనే పేరుతో తన దీక్ష కొనసాగుతోందని చెప్పారు. జిల్లా కార్యాలయాల వద్ద డీసీసీ అధ్యక్షులు కూడా దీక్ష చేస్తారని.. అయితే సామాజిక దూరం పాటించాలని కోరానని ఉత్తమ్ పేర్కొన్నారు.

English summary
pcc chief uttam kumar reddy one day agitation at gandhibhavan for farmers issue.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X