ఇవీ 'మెట్రో' కష్టాలు: అవగాహన లేకనే!.. అసౌకర్యాలకు చింతించాల్సిందే!..
Recommended Video
హైదరాబాద్: ఎప్పుడెప్పుడా అన్న నిరీక్షణకు తెరపడి భాగ్యనగర వాసులు మెట్రో ప్రయాణ కల నెరవేరింది. దేశంలోని ఇతర మెట్రోలతో పోలిస్తే తొలి రెండు రోజులు భాగ్యనగర మెట్రోకు విపరీతమైన ఆదరణ లభించింది.
మెట్రోలో తొలి జర్నీని చాలామంది నగరవాసులు మధురానుభూతిగా భావిస్తున్నారు. ఆ జ్ఞాపకాలను సెల్ఫీల రూపంలో పదిలపరుచుకుంటున్నారు. మెట్రోతో నగరవాసుల్లో కొత్త ఉత్సాహం కొట్టొచ్చినట్లు కనిపిస్తున్నప్పటికీ.. నిబంధనలపై అవగాహన లేకపోవడం కొంతమందిని గందరగోళానికి గురిచేస్తోంది.
29నిమిషాల్లోపు వస్తేనే!: మెట్రో ఎక్కాలంటే ఇవి పాటించాల్సిందే.., వాటిపై నిషేధం!
జనంలోకి వెళ్లని నిబంధనలు:
మెట్రో నిబంధనల గురించి ప్రజలకు ఇంకా పూర్తి స్థాయి అవగాహన ఏర్పడలేదు. దీంతో మెట్రో స్టేషన్లలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను వారు పాటించలేకపోతున్నారు. ఫలితంగా తమ స్మార్ట్ కార్డుల నుంచి ఎక్కువ ఛార్జీలు వసూలు అవుతున్నాయి. అంతేకాగా, రెండు గంటలకు మించి స్టేషన్లలో ఉండరాదన్న నిబంధన కూడా చాలామందికి తెలియలేదు. దీంతో నిబంధనలు తెలియక కొంతమంది జరిమానాలు చెల్లించేసుకుంటున్నారు.
3లక్షల కి.మీ: ప్రారంభానికి ముందే!, హైదరాబాద్ మెట్రో.. కొత్త విషయం వెలుగులోకి..
దిగాల్సిన చోట దిగకపోయినా:
దిగాల్సిన చోట కాకుండా మరో మెట్రో స్టేషన్ లో దిగడం ద్వారా కూడా కొంతమంది జరిమానాలు కట్టినట్లు తెలుస్తోంది. అవగాహన లేమితోనే ఈ పరిస్థితులు తలెత్తుతున్నట్లు ప్రయాణికులు వాపోతున్నారు. జరిమానాలు పర్సులు ఖాళీ చేయిస్తుండటంతో.. ఎల్&టీ మెట్రో యాజమాన్యం, ప్రభుత్వం మెట్రో నిబంధనలపై అవగాహన కల్పించేందుకు విస్తృత ఏర్పాట్లు చేయాల్సిన అవసరం కనిపిస్తోంది.
ఇవీ కష్టాలు:
మెట్రోలోకి వాటర్ బాటిల్స్ అనుమతించకపోవడం, స్టేషన్లో తాగునీటి, మరుగుదొడ్డి సౌకర్యాలు లేకపోవడంతో ప్రయాణికులకు కష్టాలు తప్పట్లేదు. అలాగే పరిమితికి మించి లగేజీని అనుమతించకపోవడం పట్ల కూడా ప్రయాణికులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అయితే 40కేజీలకు మించి లగేజీని అనుమతిస్తే.. ఎక్కువమంది వ్యాపారులు కూడా మెట్రో పైనే ఆధారపడే అవకాశం ఉండటంతో అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
తొలి రోజు మెట్రో జర్నీ: హైదరాబాదీలంతా 'ఫుల్ ఖుష్', స్మార్ట్ కార్డు తిరిగిచ్చే ఛాన్స్!
ఛార్జీలపై ఇలా:
మెట్రో ఛార్జీలపై కూడా కొంతమంది ప్రయాణికులు పెదవి విరుస్తున్నారు. ఛార్జీలు ఎక్కువగా ఉన్నాయని కొంతమంది వాపోతోంటే.. రీజనబుల్ గానే ఉన్నాయని మరికొందరు చెబుతున్నారు. రెండో రోజు కొన్ని చోట్ల టికెట్ కౌంటర్లలోని కంప్యూటర్లు మొరాయించడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. మరికొన్ని చోట్ల స్కానింగ్ యంత్రాలు పనిచేయలేదు.
పార్కింగ్ కష్టాలు:
మెట్రో ప్రయాణం బాగానే ఉన్నప్పటికీ.. పార్కింగ్ సౌకర్యం లేకపోవడం ప్రయాణికులను ఇబ్బందులకు గురిచేస్తోంది. స్టేషన్ దాకా వాహనాలను తీసుకొచ్చి వాటిని ఎక్కడ పార్క్ చేయాలో తెలియక తలపట్టుకుంటున్నారు. కొన్ని స్టేషన్ల వద్ద పార్క్ చేసిన వాహనాలను ట్రాఫిక్ అధికారులు తీసుకెళ్లడంతో వాహనాదారులు లబోదిబోమన్నారు.