వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆదాయపన్నులో మార్పులు, పన్ను మినహాయింపు పరిధి రూ.4 లక్షలకు పెంపు?

ఆదాయ పన్ను పరిమితులలో మార్పులు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. పన్ను మినహాయింపును రెండు లక్షల అరవై వేల నుంచి రూ.4 లక్షలకు పెంచే అవకాశముంది.

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: ఆదాయ పన్ను పరిమితులలో మార్పులు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రధానంగా ప్రస్తుతం వార్షికా ఆదాయం 2.60 లక్షలు దాటితే పన్ను పరిమితిలోకి వస్తున్నారు. దీనిని పెంచే అవకాశముంది. పన్ను మినహాయింపును రెండు లక్షల అరవై వేల నుంచి రూ.4 లక్షలకు పెంచే అవకాశముంది.

రూ.4 లక్షల నుంచి రూ.10 లక్షల ఆదాయం ఉంటే పది శాతం పన్ను విధించవచ్చును. అలాగే, రూ.10 లక్షల నుంచి 15 లక్షల వరకు ఉంటే 15 శాతం పన్ను, రూ.15 లక్షల నుంచి రూ.20 లక్షల ఆదాయం ఉంటే 20 శాతం పన్ను, రూ.20 లక్షలకు పైగా ఆదాయం ఉంటే 30 శాతం పన్ను విధించే అవకాశముంది.

ఈ దిశగా కేంద్రం కసరత్తు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఆదాయ పన్ను పరిమితిని రూ.2.60 లక్షల నుంచి రూ.4 లక్షలకు పెంచితే చాలామందికి ఊరట లభిస్తుంది. ఆదాయ పన్ను పరిమితి పెంచాలని చాలామంది ఉద్యోగులు వేచి చూస్తున్నారు.

IT

తగ్గిన ఈపీఎఫ్ వడ్డీ రేటు

ప్రావిడెంట్ ఫండ్ డిపాజిట్ల‌పై వ‌డ్డీ రేట్ల‌ను ప్ర‌క‌టించారు. 2016-17 సంవ‌త్స‌రానికి ఈపీఎఫ్ డిపాజిట్‌పై వ‌డ్డీ రేటును 8.65 శాతంగా ఫిక్స్ చేశారు. గ‌త ఏడాదితో పోలిస్తే ఇది త‌క్కువే.

గ‌త ఏడాది ఈపీఎఫ్ డిపాజిట్ల‌పై 8.8 శాతం వ‌డ్డీ క‌ల్పించారు. కేంద్ర కార్మిక శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ చేసిన ప్రతిపాదన మేరకు ఈపీఎఫ్ వడ్డీరేటును ఫిక్స్ చేశారు. గత ఎనిమిది ఏళ్లలో ఈపీఎఫ్ వడ్డీ రేటు తగ్గడం ఇదే మొదటిసారి.

English summary
Personal Income Tax exemption limit to rs 4 lakh?
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X