విటుల నుండి డబ్బులు వసూలు చేస్తోన్న ఇంజనీరింగ్ విధ్యార్థులు వీరే...(పిక్చర్)
విటులను బెదిరించి డబ్బులు వసూలు చేస్తోన్న ఇంజనీరింగ్ విధ్యార్థులను కూకట్ పల్లిలో పోలీసులు అరెస్టు చేశారు. జల్సాలకు అలవాటు పడి సులభంగా డబ్బులు సంపాదించే మార్గాన్ని ఎంచుకొన్నారు నిందితులు.
హైదరాబాద్:జల్సాలకు అలవాటు పడిన కొందరు ఇంజనీరింగ్ విధ్యార్థులు విటుల నుండి డబ్బులు గుంజుతున్నారు. వ్యభిచార గృహల ముందు రెక్కీలునిర్వహిస్తూ అక్కడికి వచ్చే విటులను బెదిరించి ఇంజనీరింగ్ విధ్యార్థులు డబ్బులు లాగుతున్నారు. బాధితుల ఫిర్యాదుమేరకు ఆరుగురు ఇంజనీరింగ్ విధ్యార్థులను పోలీసులు అరెస్టు చేశారు.
జల్సాలకు అలవాటు పడి ఇంజనీరింగ్ విధ్యార్థులు సులభంగా డబ్బులు సంపాదించేందుకు విటుల నుండి డబ్బులు లాగాలనే పథకాన్ని ఎంచుకొన్నారు
కూకట్ పల్లి కెపిహెచ్ బి కాలనీలోని వ్యభిచార గృహలకు వచ్చే విటులను ఆరుగురు ఇంజనీరింగ్ విధ్యార్థులు బెదిరించి డబ్బులు గుంజుతున్నారు.
వ్యభిచార గృహాలకు వచ్చిన విటులను ఫోటోలుతీసి ఈ ఫోటోలను చూపి డబ్బులు ఇవ్వకపోతే వాటిని బయటపెడతామని బెదిరించేవారు. అయితే కొందరు బాధితులు పోలీసులను ఆశ్రయించడంతో పోలీసులు ఆరుగురు నిందితులను అరెస్టు చేశారు పోలీసులు.