డిమాండ్: రన్తో కేసీఆర్కు ఏబీవీపీ ఝలక్ (పిక్చర్స్)
హైదరాబాద్: ఉస్మానియా విశ్వవిద్యాలయంలో బుధవారం అఖిల భారత విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ) ఆధ్వర్యంలో బోధనా రుసుం కోసం పరుగు (రన్ ఫర్ ఫీజు రీయింబర్సుమెంట్స్) కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ పరుగు ఆర్ట్స్ కళాశాల ప్రాంగణం నుండి ఎన్సీసీ గేటు వరకు సాగింది. అనంతరం ఏబీవీపీ జాతీయ కార్యదర్శి కడియం రాజు, ఓయు ఇంఛార్జి ఎల్లస్వామిలు మాట్లాడారు.
ప్రభుత్వం విద్యార్థుల భవిష్యత్తును ప్రశ్నార్థకంగా మారుస్తోందని మండిపడ్డారు. ఇదే అంశం పైన గురువారం తలపెట్టిన కళాశాలల బందును విజయవంతం చేయాలన్నారు.
రన్ ఫర్ ఫీజు రీయింబర్సుమెంట్స్
అఖిల భారత విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ) శంషాబాద్ ప్రాంతంలో రన్ ఫర్ ఫీజురీయింబర్సుమెంట్స్ కార్యక్రమాన్ని నిర్వహించింది. ఇందులో దాదాపు ఎనిమిదివేల మంది విద్యార్థులు పాల్గొన్నారు.
రన్ ఫర్ ఫీజు రీయింబర్సుమెంట్స్
ప్రభుత్వం నుండి విడుదల కావాల్సిన రూ.980 కోట్లను వెంటనే విడుదల చేయాలని, 14 లక్షల మంది విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని అఖిల భారత విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ) ఆరోపించింది.
రన్ ఫర్ ఫీజు రీయింబర్సుమెంట్స్
ప్రభుత్వం వెంటనే కొత్తగా స్కాలర్ షిప్స్ కోసం దరఖాస్తు చేసుకునేందుకు తేదీలు ప్రకటించాలని అఖిల భారత విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ) డిమాండ్ చేసింది.
రన్ ఫర్ ఫీజు రీయింబర్సుమెంట్స్
ప్రభుత్వం ఫాస్ట్ పథకం పైన విద్యార్థులకు పూర్తి వివరాలు అందించాలని అఖిల భారత విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ) డిమాండ్ చేసింది.
రన్ ఫర్ ఫీజు రీయింబర్సుమెంట్స్
ప్రభుత్వం ఫీజు రీయింబర్సుమెంట్స్ చెల్లించనందున గురువారం నాడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బందుకు అఖిల భారత విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ) పిలుపునిచ్చింది.
రన్ ఫర్ ఫీజు రీయింబర్సుమెంట్స్
అఖిల భారత విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ) శంషాబాద్ ప్రాంతంలో రన్ ఫర్ ఫీజురీయింబర్సుమెంట్స్ కార్యక్రమాన్ని నిర్వహించింది. ఇందులో దాదాపు ఎనిమిదివేల మంది విద్యార్థులు పాల్గొన్నారు.