వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నోటుకు ఓటు, ఫోన్ ట్యాపింగ్‌లపై హైకోర్టులో పిల్

By Pratap
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: ఓటుకు నోటు, ఫోన్ ట్యాపింగ్, శాసనసభ్యుల పార్టీ ఫిరాయింపులపై సోమవారం హైకోర్టులో ప్రజా ప్రయోజనాల వ్యాజ్యం (పిల్) దాఖలైంది. ఈ మూడు వ్యవహారాలపై సిబిఐతో విచారణ జరిపించాలని కోరుతూ పివి కృష్ణయ్య అనే న్యాయవాది సోమవారం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

హైదరాబాదులో సెక్షన్ 8ను అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని కూడా ఆయన హైకోర్టును కోరారు. పిటిషన్ విచారణ అర్హతను హైకోర్టు ప్రశ్నించింది. పిటిషన్‌పై విచారణ చేపట్టాలంటే రెండు వారాల్లో లక్ష రూపాయలు డిపాజిట్ చేయాలని హైకోర్టు కృష్ణయ్యను ఆదేశించింది.

PIL filed in High court on Cash for vote

హుస్సేన్ సాగర్‌లో నిమజ్జనంపై పిటిషన్

హైదరాబాదులోని హుస్సేన్‌సాగర్‌లో వినాయక నిమజ్జనం ఆపాలని దాఖలైన పిటిషన్‌పై సోమవారం హైకోర్టులో విచారణ జరిగింది. 15 అడుగులలోపు విగ్రహాలను నిమజ్జనంచేస్తే అభ్యంతరం ఏమిటని పిటిషనర్లను హైకోర్టు ప్రశ్నించింది. దీని వల్ల వచ్చే సమస్యలు ఏమి లేవని హైకోర్టు తెలిపింది. అనంతరం తదుపరి విచారణను ఈనెల 27కు కోర్టు వాయిదా వేసింది.

బెంగళూరు తరహాలో హైదరాబాదులో వినాయ నిమజ్జనం జరిపేలా ఆదేశించాలని పిటిషనర్ హైకోర్టును కోరారు. దాని సాధ్యాసాధ్యాలపై నివేదిక సమర్పించాలని హైకోర్టు హైదరాబాద్ మహానగర పాలక సంస్థ (జిహెచ్ఎంసి)ని ఆదేశించింది.

వినాయక చవితి సందర్భంగా యేటా గణేశుడి విగ్రహాలను హుస్సేన్ సాగర్‌లో నిమజ్జనం చేస్తున్న విషయం తెలిసిందే. అయితే, బెంగళూరులో లోతుగా తవ్విన గుంతల్లో నీళ్లను నింపి అందులో విగ్రహాలను నిమజ్జనం చేస్తుంటారు. అయితే, దీన్ని హిందూ సంప్రదాయవాదులు వ్యతిరేకిస్తున్నారు.

English summary
Advocate PV Krishnaiah filed PIL in High court on cash for vote and phone tapping issues.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X