మా అమ్మను కాపాడండి: కేటీఆర్కు సాఫ్ట్ వేర్ ఉద్యోగిని వినతి
హైదరాబాద్: తమ తల్లిని కాపాడాలంటూ ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగిని తెలంగాణ ఐటీ, పురపాలక మంత్రి కేటీఆర్ను కోరింది. బీహార్ రాష్ట్రంలోని తూర్పు చంపారన్ జిల్లా రక్షాహుల్ జిల్లాలో అపహరణకు గురైన తన తల్లిని కాపాడాలని హైదరాబాద్ హైటెక్ సిటీకి చెందిన టెక్కీ గరిమ ట్విట్టర్ వేదికగా మంత్రికి విన్నవించింది.
Very sorry to hear that Garima Ji
— KTR (@KTRTRS) February 1, 2020
Request @TelanganaDGP to speak to your counterpart in Bihar. Will reach out to @NitishKumar office too
Also I request all to retweet and spread the word to help locate Garima’s mother https://t.co/wDbwxOSWrs
మంగళవారం తన తల్లిని ఇంట్లో నుంచి కొందరు దుండగులు కిడ్నాప్ చేశారని, ఆమె ఆచూకీ తెలియడం లేదని గరిమ ట్విట్టర్ వేదకిగా వెల్లడించింది. తన తల్లిని కాపాడాలంటూ మంత్రి కేటీఆర్ తోపాటు బీహార్ సీఎం నితీస్ కుమార్, బీహార్ డీజీపీ, సంబంధిత జిల్లా కలెక్టర్, కేంద్రమంత్రి అమిత్ షాను కోరింది.
సోషల్ మీడియాలో ఎప్పుడూ చురుగ్గా ఉండే మంత్రి కేటీఆర్.. ఆమె వినతికి వెంటనే స్పందించారు. యువతి తల్లిని కాపాడుతామంటూ హామీ ఇచ్చారు. తెలంగాణ డీజీపీకి ఈ యువతి అభ్యర్థనను తెలియజేశారు. అంతేగాక, బీహార్ డీజీపీని సంప్రదించి, గరిమ తల్లిని ఆచూకీ కనుగొనాలని తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డికి సూచించారు.
మంత్రి ఆదేశాల నేపథ్యంలో తెలంగాణ డీజీపీ.. బీహార్ డీజీపీకి సమాచారాన్ని అందించారు. 'మీ తల్లి సురక్షితంగా ఇంటికి తిరిగి వస్తుందని నమ్ముతున్నాను' అని గరిమ ట్వీట్కు రిప్లై ఇచ్చారు.
Many happy returns of the day to Hon'ble Chairman of Legislative Council of Telangana Sri Gutha Sukender Reddy Garu who celebrates his birthday today 💐
— KTR (@KTRTRS) February 2, 2020
Wishing you good health, peace happiness and a long life in public service Sir. pic.twitter.com/xSboU05Yjs
గుత్తాకు శుభాకాంక్షలు
శాసనసభ
మండలి
ఛైర్మన్
గుత్తా
సుఖేందర్
రెడ్డికి
రాష్ట్ర,
ఐటీ,
పరిశ్రమల
శాఖ
మంత్రి
కేటీఆర్
శుభాకాంక్షలు
తెలిపారు.
ఆయురారోగ్యాలు,
సుఖశాంతులతో
ప్రజాజీవనంలో
సుదీర్ఘ
కాలంపాటు
కొనసాగాల్సిందిగా
మంత్రి
ఆకాంక్షించారు.
గుత్తా
సుఖేందర్
రెడ్డి
67వ
పుట్టిన
రోజు
సందర్భంగా
కేటీఈర్
ట్విట్టర్
వేదికగా
శుభాకాంక్షలు
తెలిపారు.